బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన అఖిలేష్.. ఎందుకో తెలిస్తే షాకే..!
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది.. ఆదిలోనే అధికార బీజేపీకి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజకీయ వలసలకు తెరలేపారు సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. దీంతో షాక్ తిన్న కమల దళం.. తేరుకుని.. అఖిలేష్ ఫ్యామిలీ నుంచి వలసలను ప్రోత్సహించింది.. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి ఇద్దరికి బీజేపీ కండువా కప్పింది.. ఈ వ్యవహారంపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. మొదటగా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.. తమ కుటుంబ సభ్యుల్ని చేర్చుకున్నందుకు బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన ఆయన.. కుటుంబ పార్టీలని తమను విమర్శించే వారు ఆ మరకల్ని తుడిపేస్తున్నారని పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూ సమయంలో ఒక వైపేమో బీజేపీ నేతలు ఎస్పీవైపుకు వస్తుంటే మరోవైపేమో ములాయం కుటుంబ సభ్యులు ఎస్పీ నుంచి బీజేపీ వైపునకు వెళ్తున్నారని ప్రస్తావించిన మీడియా ప్రతినిధి.. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ్వాదీ పార్టీలో ఆయారాం.. గయారాం రాజకీయాలు ఎక్కువ అయ్యాయి.. వాటిని మీరెలా మేనేజ్ చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.. దానికి సమాధానమిస్తూ.. ముందుగా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు.. ఎందుకంటే మమ్మల్ని వారస్తత్వ రాజకీయ నాయకులని, మా పార్టీని వారసత్వ రాజకీయ పార్టీయని విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు వారసత్వమే లేకుండా మా నేత్ని బీజేపీలో చేర్చుకుంటున్నారంటూ తనదైన శైలిలో పంచ్లు వేసిన అఖిలేష్.. దీంతో.. మా వారసత్వాన్ని అంతం చేస్తున్నారని పేర్కొన్నారు.. అపర్ణను బీజేపీలోకి తీసుకొని మంచి పని చేశారు. నిజానికి సమాజ్వాదీ పార్టీ ఆలోచనా విధానం ఇప్పుడు మరింత బలపడిందిని చెప్పుకొచ్చారు అఖిలేష్ యాదవ్.
Also Read
- West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో