Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తు.. రాహుల్ యాత్రపై క్లారిటీ ఇచ్చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు అయోమయం.. గందరగోళం నెలకొంది. ఓ వైపు సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్నాయని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) చెబుతూనే.. ఇంకోవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా 36 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకోవైపు కాంగ్రెస్కు 17 సీట్లు ఇస్తామంటూ రాయబారాలు నడుపుతోంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే యూపీలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు అఖిలేష్ మాత్రం పాల్గొనలేదు. తాజాగా ఈ అంశంపై అఖిలేష్ స్పందించారు.
యూపీలో కాంగ్రెస్తో (Congress) తమ పొత్తు కొనసాగుతుందని.. రాహుల్ గాంధీతో (Rahul Gandhi) తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
రాహుల్తో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని.. ఎలాంటి వివాదం లేదని అఖిలేష్ తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
మొత్తం 80 లోక్సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్కు బదులుగా సీతాపూర్ సీటును కాంగ్రెస్కు కేటాయించినట్లు సమాచారం. ఇక 2019 ఎన్నికల్లో యూపీలో రాయ్బరేలీ సీటు ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. అది కూడా సోనియా గాంధీ మాత్రం విజయం సాధించారు. అమేథీలో పోటీ చేసిన రాహుల్ మాత్రం ఓడిపోయారు. ఈసారి రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
#WATCH | Moradabad, UP: On asking why he was not present twice for the Bharat Jodo Nyay Yatra, Samajwadi Party Chief Akhilesh Yadav says, "All is well that ends well… Yes, there will be an alliance. There is no conflict. Everything will be out and clear soon… All is well that… pic.twitter.com/fOmkbYUm9B
— ANI (@ANI) February 21, 2024
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?