Maharashtra: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్న బీజేపీ, ఎన్సీపీ! కారణమిదే!
- మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్న బీజేపీ, ఎన్సీపీ!
- సొంతంగా బలం నిరూపించుకోవాలనుకుంటున్న అజిత్ పవార్
- ఇప్పటికే సింగిల్గా పోటీ చేస్తామన్న శివసేన(యూబీటీ)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు కూటమిల్లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మహా వికాస్ అఘాడీ కూటమి డీలా పడింది. శివసేన (యూబీటీ) ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక మహాయుతిలో కూడా దాదాపుగా అవే పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న ఆ పొత్తు.. లోకల్ ఎన్నికల్లోనూ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉండబోదని సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ విడివిడిగా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు అజిత్ పవార్ సన్నాహకాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jailer 2: ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్.. మామూలుగా లేదుగా..!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఎన్సీపీ నేతల సమాచారం ప్రకారం.. బీఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి తీసుకు వెళ్లే కీలక బాధ్యతలను ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్కు అప్పగించనున్నారు. సివిక్ పోల్స్ ఎలక్షన్ ఇన్చార్జిగా ఆయనను పార్టీ నియమించనుంది. తద్వారా ముంబైలో ఎన్సీపీ పట్టును పెంచుకోవాలనుకుంటోంది. మరోవైపు విపక్ష మహా వికాస్ అఘాడిలోనూ ప్రధాన పార్టీలు బీఎంసీ ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్నాయి. ఎంవీఏ కీలక భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో చర్చలు ఉంటాయని శరద్ పవార్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Russia-India: రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మృతి.. భారతీయుల్ని విడుదల చేయాలన్న భారత్
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..