Ajit Doval: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్తో అజిత్ దోవల్ భేటీ..
- రష్యా అధ్యక్షుడు పుతిన్తో అజిత్ దోవల్ భేటీ..
- ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక రష్యా అధినేత ముందుకు..
- వచ్చే నెలలో బ్రిక్స్ సమావేశానికి మోడీ హాజరవుతారని పుతిన్ ఆశాభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పుతిన్తో దోవల్ కరచాలనం చేసిన చిత్రాలను భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్లో ట్వీట్ చేసింది. ఉక్రెయిన్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసిన రెండు వారాల తర్వాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు.
Read Also: Russia: రష్యన్ ఆర్మీలో చేరిన 45 మంది భారతీయులకు విముక్తి.. మరో 50 మందిని రక్షించే ప్రయత్నం..
Also Read
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి నెలకొనేలా ‘పీస్ ప్లాన్’ కోసం దోవల్ రష్యా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ తన ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జెలన్స్కీతో చర్చలు జరిపారు. యుద్ధం ముగించడానికి రెండు దేశాలు కూడా కలిసి మాట్లాడుకోవాలని, దౌత్యం, చర్యలతో సమస్య పరిష్కరించుకోవాలని, శాంతి పునరుద్ధరణకు భారత్ క్రియాశీలక పాత్ర పోషించడానికి సద్ధంగా ఉందని చెప్పారు.
దోవల్ రష్యా పర్యటన శాంతి చర్చల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన భేటీలో ఈ శాంతి ప్రణాళికను పుతిన్ వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చే నెలలో రష్యాలోని కజాన్కి ప్రధాని మోడీ వస్తారనే ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు. ‘‘ మేము మా మంచి స్నేహితుడు మోడీ కోసం ఎదురుచూస్తున్నాం. ఆయనకు శుభాకాంక్షలు’’ అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు రష్యన్ ఎంబసీ పేర్కొంది.
🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg.
👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!