Air India Crash: యూకేలో బాధిత కుటుంబాలకు రెండు తప్పుడు మృతదేహాలు..
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం..
- యూకేకు పంపిన రెండు మృతదేహాల డీఎన్ఏ మిస్మ్యాచ్..
- బాధిత కుటుంబాలతో సరిపోలని డీఎన్ఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన యూకే జాతీయులకు సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది. బాధిత కుటుంబాలకు రెండు మృతదేహాలు తప్పుగా పంపించినట్లు బాధిత కుటుంబాల న్యాయవాది తెలిపారు. ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు మృతదేహాలకు తిరిగి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించడగా, కనీసం రెండు శవ పేటికల్లో వ్యత్యాసాలు వెల్లడయినట్లు ఆరోపించారు. ఈ రెండు మృతదేహాల అవశేషాలు బాధిత కుటుంబాలతో సరిపోలలేదని తెలుస్తోంది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన కుటుంబాల తరుపున వాదించే న్యాయవాది జేమ్స్ హేలీ చెబుతున్న దాని ప్రకారం.. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా AI171 కూలిపోయిన తర్వాత 12 నుండి 13 సెట్ల మానవ అవశేషాలను యునైటెడ్ కింగ్డమ్కు వచ్చాయని, వీటిలో డీఎన్ఏ విశ్లేషణ తర్వాత బాధిత కుటుంబాలకు వచ్చిన అవశేషాలు వారికి సంబంధించినవి కావని చెప్పారు.
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Read Also: Akhilesh Yadav: మసీదులో అఖిలేష్ యాదవ్ మీటింగ్, డింపుల్ యాదవ్ దుస్తులపై వివాదం..
డీఎన్ఏ నమూనాలను ఎయిర్ ఇండియా కాకుండా అహ్మదాబాద్లోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి నిర్వహించింది. గుర్తింపు ప్రక్రియా, మృతదేహాలను అప్పగించడంలో ఎయిర్ ఇండియాకు ప్రమేయం లేదు. మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను అంతర్జాతీయ అత్యవసర సేవ సంస్థ అయిన కెన్యాన్ ద్వారా ఎయిర్ ఇండియా కార్గో ద్వారా యూకేకు పంపారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియా దర్యాప్తు చేస్తున్నట్లు అంగీకరించింది. అయితే, ఆరోపించిన మృతదేహాల గురించి అధికారిక ధ్రువీకరణ జారీ చేయలేదు.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ గాట్విక్కు వెళ్తున్న విమానం క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. ఇందులో 53 మంది బ్రిటిష్ పౌరులు. చనిపోయిన బ్రిటిష్ పౌరుల్లో అనేక మంది అంత్యక్రియలు భారత్ లోనే జరిగాయి. 12 మృతదేహాలను యూకేకు పంపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!