Tamil Nadu: పళనిస్వామికి డెడ్లైన్ విధించిన సెంగోట్టయన్పై వేటు
- అన్నాడీఎంకేలో ముదురుతున్న విభేదాలు
- పళనిస్వామికి డెడ్లైన్ విధించిన సెంగోట్టయన్పై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముగింట అన్నాడీఎంకేలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్పై మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి యాక్షన్ తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తొలగించారు.
ఇది కూడా చదవండి: UP: లక్నో అమిటీ వర్సిటీలో దారుణం.. సహచర విద్యార్థిని 60 చెంపదెబ్బలు కొట్టిన స్నేహితులు
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని.. బహిష్కరించిన వారిని తిరిగి 10 రోజుల్లో పార్టీలో చేర్చుకోవాలంటూ పళనిస్వామికి మాజీ మంత్రి సెంగోట్టయన్ డెడ్లైన్ విధించారు. పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్తో సహా అందరిని చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. తీరా చూస్తే సెంగోట్టయన్కే పళనిస్వామి షాకిచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారంటూ ఈరోడ్డు రూరల్ జిల్లా సెక్రటరీ పదవి నుంచి పళనిస్వామి తొలగించారు. ఎమ్మెల్యే సెంగొట్టయన్ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు శనివారం పళనిస్వామి ప్రకటించారు.
ఇది కూడా చదవండి: UP: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా.. 3 రెట్ల జీతం పెంపు
శనివారం ఉదయం దిండిగల్లోని ఒక హోటల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, ఏడుగురు సీనియర్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు గంటకు పైగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల సెంగోట్టయన్ సంతోషం వ్యక్తం చేశారు. బహిష్కరించబడిన నాయకులను తిరిగి తీసుకువస్తేనే అన్నాడీఎంకే ఎన్నికల్లో గెలవగలదని అభిప్రాయపడ్డారు. ఎంజీఆర్, జయలలితతో సెంగోట్టయన్ పనిచేశారు. దాదాపు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడనున్నాయి. ఈసారి ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.

తాజావార్తలు
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?