Tamil Nadu: పళనిస్వామికి డెడ్లైన్ విధించిన సెంగోట్టయన్పై వేటు
- అన్నాడీఎంకేలో ముదురుతున్న విభేదాలు
- పళనిస్వామికి డెడ్లైన్ విధించిన సెంగోట్టయన్పై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముగింట అన్నాడీఎంకేలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్పై మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి యాక్షన్ తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తొలగించారు.
ఇది కూడా చదవండి: UP: లక్నో అమిటీ వర్సిటీలో దారుణం.. సహచర విద్యార్థిని 60 చెంపదెబ్బలు కొట్టిన స్నేహితులు
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని.. బహిష్కరించిన వారిని తిరిగి 10 రోజుల్లో పార్టీలో చేర్చుకోవాలంటూ పళనిస్వామికి మాజీ మంత్రి సెంగోట్టయన్ డెడ్లైన్ విధించారు. పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్తో సహా అందరిని చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. తీరా చూస్తే సెంగోట్టయన్కే పళనిస్వామి షాకిచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారంటూ ఈరోడ్డు రూరల్ జిల్లా సెక్రటరీ పదవి నుంచి పళనిస్వామి తొలగించారు. ఎమ్మెల్యే సెంగొట్టయన్ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు శనివారం పళనిస్వామి ప్రకటించారు.
ఇది కూడా చదవండి: UP: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా.. 3 రెట్ల జీతం పెంపు
శనివారం ఉదయం దిండిగల్లోని ఒక హోటల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, ఏడుగురు సీనియర్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు గంటకు పైగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల సెంగోట్టయన్ సంతోషం వ్యక్తం చేశారు. బహిష్కరించబడిన నాయకులను తిరిగి తీసుకువస్తేనే అన్నాడీఎంకే ఎన్నికల్లో గెలవగలదని అభిప్రాయపడ్డారు. ఎంజీఆర్, జయలలితతో సెంగోట్టయన్ పనిచేశారు. దాదాపు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడనున్నాయి. ఈసారి ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.

తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!