Conversion racket: “హిందూ బాలికల”కు వల.. 2050 నాటికి భారత్లో ఇస్లాం వ్యాప్తి చేయడమే లక్ష్యం..
- ఆన్లైన్ గేమ్లతో హిందూ బాలికలకు వల..
- ఆగ్రాలో పట్టుబడిన మతమార్పిడి ముఠా..
- పాకిస్తాన్తో ముఠాకు సంబంధాలు..
- 2050 నాటికి దేశంలో ఇస్లాం వ్యాప్తి చేయాలని లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Conversion racket: పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న మతమార్పిడి ముఠాను ఆగ్రా పోలీసులు పట్టుకున్నట్లు శనివారం వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్ సోషల్ మీడియా, లూడో స్టార్ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారామ్స్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లు, డార్క్ వెబ్లను ఉపయోగించి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. క్రౌడ్ ఫండింగ్, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు లావాదేశీలు జరిగాయని అధికారులు కనుగొన్నారు. గాజాకు నిధులు నిధులను పంపడం, స్వీకరించినట్లు తేలింది. పాకిస్తాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు తన్వీర్ అహ్మద్, సాహిల్ అదీబ్లను ఈ నెట్వర్క్ నాయకులుగా గుర్తించారు. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి వాట్సాప్, ఆన్లైన్ గ్రూపులనను నడిపిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్రూపుల్లో మతపరమైన విషయాలను పంచుకున్నట్లు తెలిసింది.
Read Also: Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన బాలికలు పాకిస్తాన్కు చెందిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారు మతపరమైన బోధన అందించినట్లు పరిశోధకులు తెలిపారు. కొంతమంది కాశ్మీరీ అమ్మాయిలు, ఇతరులను పాకిస్తాన్ ఆధారిత గ్రూపులతో అనుసంధానించడం ద్వారా మతమార్పిడిన ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. కీలక నిందితుల్లో ఒకరైన రెహమాన్ ఖురేషి ఈ నెట్వర్క్లో ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నాడు. ఆగ్రా పోలీసులు, కేంద్ర సంస్థలు ఇతడిని ప్రశ్నిస్తున్నాయి.
ఈ నెట్వర్ ‘‘దవాహ్’’ పేరుతో పనిచేస్తోందని, 2050 నాటికి భారతదేశంలో ఇస్లాంను వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. నిందితులు ఎమోషన్గా ఉన్నవారిని ,కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా హిందూ బాలికతలో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, ఎవరికి తెలియకుండా డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకునే వారని తేలింది.
ఈ నిందితుల బృందం మతమార్పిడి చెందిన వ్యక్తులను ‘‘రివర్ట్’’ అని పేర్కొంది. ఢిల్లీకి చెందిన అబ్దుల్ రెహమాన్, గోవాకు చెందిన అయేషా ఈ గ్రూపు నాయకులుగా గుర్తించారు. 1990లో మతమార్పిడి చెందిన అబ్దుల్ రెహమాన్కు ప్రస్తుతం ఈ కేసులో పట్టుబడిన వారిలో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాకు చెందిన బాలికలను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం వీరందరిని పోలీసులు రక్షించారు.
తాజావార్తలు
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!