Agnipath: అగ్నిపథ్ పై కేంద్రం కీలక నిర్ణయం.. రక్షణ శాఖలో 10 శాతం కోటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ స్కీమ్ పై తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులకు మరిన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లో త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు. దేశంలో ‘ అగ్నిపథ్ ’పై జరుగుతున్న ఆందోళన గురించి చర్చించారు. అగ్నిపథ్ కింద కేవలం నాలుగేళ్ల కాలపరిమితికే ఆర్మీలో చేర్చుకోవడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించడంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఆశావహుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో బీహార్, హర్యానా, తెలంగాణ భారీ విధ్వంసకాండ జరిగింది. ఆందోళనలకు తలొగ్గిన కేంద్ర ప్రభత్వం ఇప్పటికే అగ్నిపథ్ తొలిబ్యాచ్ వయో పరిమితిని ఈ రోజు మరో ఐదేళ్లు సడలించింది. శుక్రవారం రెండేళ్లు సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సడలింపుతో 21 ఏళ్లు ఉన్న వయో పరిమితి 28 ఏళ్లకు పెరిగినట్లు అయింది.
ఇదిలా ఉంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ కింద ‘అగ్నివీరులకు’ 10 శాతం కోటాను రిజర్వ్ చేస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం త్రివిధ దళాల అధిపతులతో సమావేశం అనంతరం ప్రకటించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్స్, డిఫెన్స్ సివిలియన్ పోస్టుల్లో, మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రిజర్వేషన్లు ప్రస్తుతం ఎక్స్ సర్వీస్ మెన్స్ కు ఇస్తున్న రిజర్వేషన్లకు అదనంగా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇప్పటికే అగ్నిపథ్ కింద అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో (సీఏపీఎఫ్)లో, అస్సాం రైఫిల్స్ లో 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు కేంద్ర హోమంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. దీంతో పాటు అగ్నివీరులకు ఈ బలగాల్లో చేరేందుకు మూడేళ్లు సడలింపును కూడా ఇవ్వననున్నట్లు తెలిపారు. సీఏపీఎఫ్ కింద బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ జీ, ఎస్ఎస్బీ బలగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.
The 10% reservation will be implemented in the Indian Coast Guard and defence civilian posts, and all the 16 Defence Public Sector Undertakings. This reservation would be in addition to existing reservation for ex-servicemen.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) June 18, 2022
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!