Agnipath: కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరులకు సీఏపీఎఫ్లో 10 శాతం రిజర్వేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ, హర్యానా ప్రాంతాల్లో హింస చెలరేగింది. కేవలం నాలుగేళ్లకే సర్వీసును పరిమితం చేయడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకే వయోపరిమితి విధించడంతో వయస్సు దాటిపోయిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా నిన్న వయోపరిమితని మరో రెండేళ్లు పెంచగా.. తాజాగా శనివారం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.
నిరుద్యోగుల ఆందోళనతో దిగి వచ్చిన కేంద్రం మళ్లీ అగ్నివీరుల తొలి బ్యాచ్ కు మరో 5 ఏళ్ల వయోపరిమితి సడలింపులను ఇచ్చింది. దీంతో ప్రస్తుతం అగ్నివీరుల వయోపరిమితి టోటల్ గా 28 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చింది. ఇదే విధంగా కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రెండు విభాగాల్లో 10 శాతం ఉద్యోగాలకు అగ్నివీరులకు రిజర్వ్ చేయబడుతాయి. ఈ రెండు విభాగాల్లో చేరేందుకు మూడేళ్లు వయోపరిమితిని సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాయుధ బలగాల కింద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీటీ), శాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ), మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ప్రస్తుతం 70 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అగ్నిపథ్ స్కీమ్ కింద చేరిన వారికి మరింత ప్రయోజనం కలగనుంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మరోవైపు దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేఖంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. బీహార్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో విధ్వంసం చెలరేగింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బీహార్ లో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా కేంద్రం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆందోళనలు సద్దుమణిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!