Sindhu river: పాకిస్తాన్కి మరో షాక్.. “సింధు నదుల”పై 6 ప్రాజెక్టుల పనులు వేగవంతం..
- సింధు జలాల ఒప్పందం తర్వాత, పాకిస్తాన్కి మరో షాక్..
- సింధు ఉప నదులపై ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sindhu river: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని చనిపోయారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ని తన నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా, ‘‘సింధు నది జలాల’’ ఒప్పందం నిలిపేసింది. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం దాయాది దేశంలో భయాన్ని పుట్టిస్తోంది. సింధు దాని ఉపనదులు పాకిస్తాన్ 80 శాతం ప్రజలకు జీవనాధారం. ఇప్పుడు, ఇండస్ వాటర్ ట్రిటీని నిలిపేయడంతో పాకిస్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఇదిలా ఉంటే, తాజాగా భారత్ మరో నిర్ణయాన్ని తీసుకుంది జమ్మూ కాశ్మీర్లో సింధు, దాని ఉపనదులపై చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో 6 హైడ్రోపవర్ ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేయనుంది. ఈ వారం అమిత్ షా అధ్యక్షతన దీనిపై సమావేశం జరుగబోతోంది. జల్ శక్తి (జల వనరులు) మంత్రి CR పాటిల్, విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సంబంధిత మంత్రిత్వ శాఖల కీలక అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Pakistan: భారత్తో ఉద్రిక్తత.. రక్షణ బడ్జెట్ని 18% పెంచిన పాకిస్తాన్..
ఇప్పటికే, అమిత్ షా, జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్తో రెండు సార్లు సమావేశమయ్యారు. గతంలో సింధు జలాల ఒప్పందం ప్రకారం, భారత్ ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తే దానికి సంబంధించి పాకిస్తాన్కి 6 నెలల ముందు నోటీసులు అందించాలి. అయితే, ఇప్పుడు ఒప్పందం నిలిపేయడంతో పాకిస్తాన్కి సమాచారం ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఈ పరిణామం భారత్కి చీనాబ్, జీలం నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి, ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పించింది. గతంలో పాక్ అడ్డుకున్న వులార్ సరస్సు ప్రాజెక్టు కూడా పునరద్ధరించే అవకాశం ఉంది.
ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే జమ్మూ కాశ్మీర్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 10,000 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. అదనంగా నీటి పారుదల, సాగు, తాగు నీటి లభ్యత గణనీయంగా పెరుగుతుంది. కాశ్మీర్ హిమాలయ ప్రాంతంలోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులలో రిజర్వాయర్ హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఈ పరిణామాలు అన్నీ చూస్తే రాబోయే కాలంలో పాకిస్తాన్కి గడ్డు పరిస్థితులు ఏర్పడటం సుస్పష్టం.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!