Lithium: జమ్మూకాశ్మీర్ తర్వాత రాజస్థాన్లో బయటపడిన లిథియం నిల్వలు.. చైనా గుత్తాధిపత్యానికి దెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lithium: ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఖరీదైన, విలువైన ఖనిజంగా ఉన్న లిథియం నిల్వలు భారతదేశంలో బయటపడుతున్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో భారీ లిథియం నిల్వలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) వెల్లడించింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజస్థాన్ లో కూడా లిథియం నిల్వలను కనుగొన్నారు. నాగౌర్ జిల్లాలోని దేగానాలో ఈ లిథియం నిల్వలు కనుగొన్నట్లు తెలిపింది.
Read Also: Chandrika Saha: 15 నెలల పిల్లాడ్ని నేలకేసి కొట్టిన తండ్రి.. భార్య ఆ పని చేయలేదన్న కోపంతోనే..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
అయితే జమ్మూ కాశ్మీర్లో లభించిన నిల్వల కన్నా ఇవే ఎక్కువ అని, దేశవ్యాప్తంగా 80 శాతం డిమాండ్ ను ఇవి తీర్చగలవని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో, సెల్ ఫోన్లలో వాడే బ్యాటరీలు, ఎలక్ట్రానికి వాహానాల బ్యాటరీల్లో లిథియంను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. భారత్ లిథియంతో పాటు నికెల్, కోబాల్ట్ ఖనిజాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలో అధిక శక్తి సాంద్రత కలిగి ఉంటాయి. బరువు, పరిమాణం తక్కువగా ఉండటంతో వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం లిథియం నిల్వలు కనుగొనబడిన డెగానాలోని రేవంత్ కొండపై 1914లో బ్రిటిష్ వారు టంగ్స్టన్ కనుగొన్నారు. టంగ్స్టన్ మంచి విద్యుత్ వాహకం. మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటీస్ సైన్యం కోెసం యుద్ధ సామాగ్రిని తయారు చేయడానికి ఉపయోగించారు. 2017-18లో జీఎస్ఐ చేసిన సర్వేలో ఈ ప్రాంతంలో 1.36 మిలియన్ టన్నుల లిథియం ఉన్నట్లు కేంద్రమంత్రి ప్లహ్లాద్ జోషి వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో 5.9 మిలియన్ టన్నులను జీఎస్ఐ గుర్తించింది. లిథియం మరిన్ని నిల్వలను కనుగొనేందుకు జీఎస్ఐ జీ2 సర్వేని ప్రారంభించింది. డేగానాలో లిథియం నిల్వలు చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టనుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!