African Swine Fever: కేరళలో మరో వైరస్ కలకలం.. పందులను చంపేయాలని ఆదేశం
African swine fever found in Kerala: కేరళలో మరోసారి కొత్త వైరస్ బయటపడింది. ఇప్పటికే దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలోనే తొలుత బయటపడ్డాయి. తాజాగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు కేరళలో నమోదు అయినట్లు పశువర్థక శాఖ మంత్రి జే చించురాణి శుక్రవారం వెల్లడించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలోని మనంతవాడి పందుల ఫారాల్లో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇటీవల వరసగా పందులు మూకుమ్మడిగా చనిపోవడంతో పశువైద్యాధికారులు వీటి నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. దీంతో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు వెల్లడైంది. దీంతో ప్రస్తుతం పందుల ఫారాల్లో ఉన్న 300 పందులను చంపేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పరిసరాల్లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పందులను చంపాలని యోచిస్తున్నారు.
Read Also: Jamili Elections: జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన
Also Read
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
వయనాడ్ తో పాటు నార్త్ కేరళలో మరో జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. గతంలో బీహార్, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకింది. తాజాగా కేరళలో ఈ వ్యాధి బయటపడింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందులను ప్రభావితం చేస్తే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ప్రస్తుతం కేసులు రావడంతో కేరళ అధికారులు అప్రమత్తం అయ్యారు. జంతువుల నుంచి మానవులకు ఈ వ్యాధి సంక్రమించడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వయనాడ్ జిల్లాతో పాటు కోజికోడ్ జిల్లా కూడా అలర్ట్ అయింది. అయితే బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపించడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం గత రెండు వారాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పందులు, వాటి మాంసాన్ని రవాణా చేయడాన్ని నిషేధించింది. ప్రజలు రెడ్ మీట్ ను తినడానికి ముందు బాగా ఉడికించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం… ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అటవీ, పెంపుడు పందుల్లో వ్యాపించే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన అంటువ్యాధి అని.. దీనివల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. మానవుకు కూడా ముప్పు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
-
Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
-
EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
-
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!