Adhir Ranjan Chowdhury: ‘‘దేశంలో నిగ్రిటో ప్రజలు ఉన్నారు’’.. అధిర్ వ్యాఖ్యల కలకలం.. ఇరకాటంలో కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan Chowdhury: ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ చీఫ్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దేశంలో ఉత్తర భారతీయులు తెల్లగా, దక్షిణాది వారు ఆఫ్రికన్లుగా, ఈశాన్య ప్రజలు చైనీయులుగా, పశ్చిమాన ఉన్న వారు అరబ్బులుగా కనిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. బీజేపీ కాంగ్రెస్, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఇండియా కూటమి ఇలాంటి వ్యాఖ్యల్ని హర్షిందని ఓ ప్రకటన చేసింది. ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన పదవికి బుధవారం రాజీనామా చేశారు.
Read Also: RCB vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇప్పటికే పిట్రోడా వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ని, ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలోకి నెట్టాయి. గురువారం అధిర్ మాట్లాడుతూ.. ‘‘మాకు ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్, మంగోలాయిడ్లు, (మరియు) నెగ్రిటో తరగతి ప్రజలు ఉన్నారు. మన దేశ జనాభాలో ప్రాంతీయ లక్షణాలు భిన్నంగా ఉంటాయి.’’ అని పిట్రోడా వ్యాఖ్యల్ని సమర్థించేందుకు చేసిన ప్రయత్నంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొందమంది తెల్లగా, మరికొందరు నల్లగా ఉంటారనేది నిజమని అధిర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నిగ్రిటోలుగా భారతీయులను పోల్చడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేత షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఇది ఒక్క అంకుల్ శామ్(శామ్ పిట్రోడా) ఆలోచన మాత్రమే కాదని, మొత్తం కాంగ్రెస్ ఆలోచన అదే విధంగా ఉందని విమర్శించారు. శామ్ పిట్రోడా భారతీయులను అరబ్బులుగా, చైనీయులుగా, ఆఫ్రికన్లుగా పోల్చడాన్ని సమర్థిస్తూ అధిర్ రంజన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పూనావాలా దుయ్యబట్టారు. విదేశాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రపతిని, రాష్ట్రపత్ని అని సంభోదించిన అధిర్ రంజన్ చౌదరీని కాంగ్రెస్ పార్టీ బర్త్రఫ్ చేస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. చర్మరంగు ఆధారంగా మన దేశస్తులను విమర్శించడాన్ని దేశం సహించదని చెప్పారు.
Adhir Ranjan crosses the limits
In defending Sam Pitroda he calls Indians (Negro or Negrito/Negrita )
Safed, Kala !Both words are offensive https://t.co/YSzE7DaJAX
It shows that the words are Sam Pitroda but soch is of Congress
Calling Indians as Chinese / African/… pic.twitter.com/9v0Uf0ChEd
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) May 9, 2024
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!