Sengol: రాజదండాన్ని ప్రధాని మోడీకి అందించిన ఆధీనం పూజారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sengol: కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ పోడియం ముందు ప్రతిష్టించబోయే రాజదండాన్ని(సెంగోల్)ని ఆధీనం పూజారులు శనివారం ప్రధాని నరేంద్రమోడీకి అందచేశారు. ఈ రోజు చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరిని తమిళ వేదపండితులు ప్రధాని మోడీకి ఈ దండాన్ని అందించారు. శనివారం సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్న వేద పండితులు ఆయన్ని ఆశ్వీర్వదించారు. రేపు ఉదయం 8.30-9.00 గంటల మధ్య పార్లమెంట్ లోక్ సభ ఛాంబర్ లో సెంగోల్ ను ఏర్పాటు చేస్తారు.
Read Also: Bandi Sanjay: 5 నెలల్లో ఎన్నికలు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్ బాటన్ నుంచి అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ ఈ రాజదండాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి ఈ రాజదండాన్ని అలహాబాద్ మ్యూజియంలో ఉంచారు. సెంగోల్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని రేపింది. బ్రిటీష్ వారు సెంగోల్ ను అధికారిక మార్పిడికి గుర్తుగా అభివర్ణించినట్లు ఎటువంటి డాక్యుమెంట్ ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే సెంగోల్ పై కాంగ్రెస్ వాదనలు తప్పని తమిళనాడు మఠాధిపతులు ఖండించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలు మరియు సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తుంది? భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన సెంగోల్ను అందించింది, కానీ దానిని ‘వాకింగ్ స్టిక్’గా మ్యూజియంలో ఉంచారు’’ అంటూ అమిత్ షా కాంగ్రెస్ పై మండిపడ్డారు.
ఆదివారం అట్టహాసంగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త భవనం ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రపతిని కాదని ప్రధాని ప్రారంభం చేయడాన్ని కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ తో సహా టీఎంసీ, ఆప్, ఎన్సీపీ వంటి 20 విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 25 పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించాయి.
#WATCH | Delhi | Ahead of the inauguration ceremony of #NewParliamentBuilding, PM Narendra Modi meets the Adheenams at his residence and takes their blessings. The Adheenams handover the #Sengol to the Prime Minister. pic.twitter.com/0eEaJUAX58
— ANI (@ANI) May 27, 2023
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!