Nushrratt Bharuccha: ఇజ్రాయిల్లో క్షేమంగా బాలీవుడ్ నటి.. ఇండియాకు పయనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nushrratt Bharuccha: ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు శనివారం భీకరదాడి చేశారు. ఏకంగా 5000 రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువురిని బందీలుగా హమాస్ నిర్బంధించి గాజాకు తీసుకెళ్లింది మరోవైపు ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. గాజా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 250కి పైగా ప్రజలు మరణించారు.
ఇదిలా ఉంటే హమాస్ చేసిన దాడుల తర్వాత బాలీవుడ్ నటి నహ్రత్ భరుచ్చా తప్పిపోయినట్లు వార్తలు వచ్చాయి. నిన్న దాడుల తర్వాత ఆమె ఆచూకీ కనిపించలేదనే పలు నివేదికలు వెల్లడించాయి. హైఫా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఆమె ఇజ్రాయిల్ వెళ్లారు. నిన్న మధ్యాహ్నం 12.30 తర్వాత ఆమెతో కాంటాక్ట్స్ కోల్పోయామని టీం సభ్యుల్లో ఒకరు తెలిపారు. దీంతో ఆందోళన నెలకొంది.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
Read ALSO: Hamas Attack On Israel: హమాస్ దాడి వెనక ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్-సౌదీ డీల్ అడ్డుకోవడానికేనా..?
అయితే నుష్రత్ భరుచ్చా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. ఆమె ప్రస్తుతం ఇజ్రాయిల్ నుంచి భారత్ వస్తున్నారు. ఎంబసీ సాయంతో ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తున్నామని, డైరెక్ట్ ఫ్లైట్ లభించకపోవడంతో కనెక్ట్ ఫ్లైట్ ద్వారా ఇంటికి వస్తున్నామని ఇజ్రాయిల్ వెళ్లిన నటుల బృందం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తామని, మేమంతా సురక్షితంగ ఉన్నామని వెల్లడించారు.
అకెల్లి సినిమా స్క్రీనింగ్ కోసం భరుచ్చా ఇజ్రాయిల్ వెళ్లారు. ఈ సినిమాలో ప్రముఖ వెబ్ సిరీస్ ఫౌడాలో నటించిన ఇజ్రాయిల్ నటులు సాహి హలేవి, అమీర్ బౌట్రస్ కూడా ఉన్నారు. భరుచ్చా తెలుగులో శివాజీ సరసన తాజ్మహల్(2010) సినిమాలో నటించారు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు 25సినిమాల్లో నటించారు. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం భారతీయులకు భద్రతా నియమాలను జారీ చేసింద. క్షేమంగా ఉండాలని, బయట రాకపోకలను తగ్గించాని సూచించింది.
తాజావార్తలు
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!