Bengal girl murder: అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకే బాలికని చంపేశా.. నిందితుడు మోస్తకిన్ సర్దార్..
- అత్యాచారాన్ని ప్రతిఘటించడంతోనే హత్య చేశా..
- బెంగాల్ బాలిక హత్య కేసులో ఒప్పుకున్న నిందితుడు..
- సంచలనంగా మారిన 11 ఏళ్ల బాలిక హత్య..
- అత్యాచారం చేసి హత్య చేశారని బీజేపీ ఆరోపణ..
- సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal girl murder: పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ట్యూషన్ క్లాస్కి వెళ్లి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసి పొలాల్లో శవాన్ని పారేశారు. ఈ ఘటన దక్షిణ్ 24 పరగణాస్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవక ముందే ఈ దారుణం జరగడంతో స్థానికంగా తీవ్ర నిరసనలకు, హింసాత్మక ఘటనలకు కారణమైంది.
ఈ కేసులో అరెస్టయని ప్రధాన నిందితుడు మోస్తకిన్ సర్దార్, బాలికను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఆమెపై అత్యాచారం చేయలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణలో.. మోస్తకిన్ తాను బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించానని, అయితే బాలిక ప్రతిఘటించడంతో ఆమెను చంపేసినట్లు వెల్లడించాడు. మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పారేసినట్లు పోలీసులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక పోస్టుమార్టం నివేదిక గురించి ఎదురుచూస్తు్నారు.
Also Read
Read Also: Haryana: బీజేపీ వైఫల్యాలే హర్యానాలో కాంగ్రెస్కి బలం.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికను సర్దార్ కిడ్నాప్ చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు, ఆ తర్వాత బాలికని చంపేశాడు. హత్య తర్వాత సర్దార్ ఇంటికి తిరిగి వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. నేరం చేసినందుకు నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం చూపలేదని పోలీస్ వర్గాలు తెలిపాయి. అదే రాత్రి బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్నేహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు మోస్తకిన్ సర్దార్ని అరెస్ట్ చేశారు.
చాలా రోజులుగా నిందితుడు అమ్మాయితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆమెకు ఐస్ క్రీం ఆఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ హత్యతో స్థానికంగా జిల్లాలో నిరసనలు చెలరేగాయి. పోలీసులు సరిగా విచారించకపోవడంతో తన కూతురు మృతి చెందిదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కుటుంబీకులతో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. వందలాది మంది స్థానికులు పోలీస్ ఔట్ పోస్టుని తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మహిళా నిరసనకారులు లాఠీలు, చీపుర్లు, ఆయుధాలతో నిరసన తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!