Delhi Elections: గతంలో బీజేపీ ఏం చేసిందో తెలిసిందే.. ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న ఆప్
- అభ్యర్థుల కొనుగోలు వ్యవహారంపై ఆప్ ఆరోపణలు
- ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న సంజయ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఫలితాలకు ముందు అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం వేస్తోందని.. 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేశారని కేజ్రీవాల్, సంజయ్ సింగ్ సంచలన ఆరోపణల చేశారు. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని బేరం చేశారని.. అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలను పరిశీలించాలంటూ ఏసీబీ అధికారులకు ఎల్జీ వీకే.సక్సేనా ఆదేశించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి: Infosys: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికిపై వేటు..
Also Read
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
తాజాగా ఇదే అంశంపై శుక్రవారం ఆప్ సీనియ్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ఎప్పుడూ ఇతర పార్టీలను విచ్ఛన్నం చేయాలని చూస్తుంటుందని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ల్లో ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూల్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. ఆరోపణలపై ఫిర్యాదు చేసి కచ్చితంగా విచారణ కోరతామని స్పష్టం చేశారు. మేము ఆరోపణలు చేశాక.. బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా.. ఢిల్లీ ఎల్జీ వీకే.సక్సేనాను కలిశారు. అనంతరం ఏసీబీకి ఎల్జీ లేఖ రాశారన్నారు. ఆప్ కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. కొనుగోలుపై విచారణ కోరతామన్నారు. బీజేపీ నాయకులు సంప్రదించిన.. ఆప్ నాయకుడి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగింది. 60 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. రేపే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "BJP is the most corrupt party in the country. BJP always believes in breaking other parties…BJP toppled governments in Maharashtra, Karnataka, Madhya Pradesh, Uttarakhand, Arunachal Pradesh. Do we need a certificate from them that they… pic.twitter.com/CVrpfWPrBU
— ANI (@ANI) February 7, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!