Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్తో ఆప్ సెటిల్మెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై దాడి చేశాడు. ఆమెతో పీఏ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై కేజ్రీవాల్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలివాల్పై జరిగిన దాడిపై ఆప్ స్పందించిన ఒక రోజు తర్వాత సంజయ్ సింగ్, స్వాతి మలివాల్ నివాసంలో ఆమెను బుధవారం కలిశారు. సంజయ్ సింగ్ వెంట ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యురాలు వందన కూడా ఉన్నారు. ఈ దాడి ఘటనలో స్వాతి మలివాల్తో సెటిల్మెంట్ కోసమే వీరిద్దరు ఆమె నివాసానికి వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ మలివాల్ సోమవారం ఆరోపించారు. దీనిపై పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, దీనిపై స్వాతి మలివాల్ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్ మలివాల్తో “అనుచితంగా ప్రవర్తించారు” మరియు ఈ విషయంలో ఆప్ అధినేత కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ‘‘స్వాతి మలివాల్ కేజ్రీవాల్ని కలిసేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే ఆమె డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉండగా బిభవ్ కుమార్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇది అత్యంత ఖండించదగిన సంఘటన’’ అని సంజయ్ సింగ్ అన్నారు.
అయితే, ఈ వ్యవహారం ఆప్ వర్సెస్ బీజేపీగా మారింది. దీనిపై ఫిర్యాదు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ సహాయకుడిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేయడంతో పాటు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా బుధవారం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్గా పని చేసిన ఓ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ఆమెకు మద్దతు ఇచ్చేందుకు మేం ఉన్నామని, ఈ ఘటనను ఆప్ నేత సంజయ్ సింగ్ అంగీకరించారని, కేజ్రీవాల్ నిందితుడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని సచ్దేవా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!