Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్తో ఆప్ సెటిల్మెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై దాడి చేశాడు. ఆమెతో పీఏ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై కేజ్రీవాల్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలివాల్పై జరిగిన దాడిపై ఆప్ స్పందించిన ఒక రోజు తర్వాత సంజయ్ సింగ్, స్వాతి మలివాల్ నివాసంలో ఆమెను బుధవారం కలిశారు. సంజయ్ సింగ్ వెంట ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యురాలు వందన కూడా ఉన్నారు. ఈ దాడి ఘటనలో స్వాతి మలివాల్తో సెటిల్మెంట్ కోసమే వీరిద్దరు ఆమె నివాసానికి వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ మలివాల్ సోమవారం ఆరోపించారు. దీనిపై పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, దీనిపై స్వాతి మలివాల్ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్ మలివాల్తో “అనుచితంగా ప్రవర్తించారు” మరియు ఈ విషయంలో ఆప్ అధినేత కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ‘‘స్వాతి మలివాల్ కేజ్రీవాల్ని కలిసేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే ఆమె డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉండగా బిభవ్ కుమార్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇది అత్యంత ఖండించదగిన సంఘటన’’ అని సంజయ్ సింగ్ అన్నారు.
అయితే, ఈ వ్యవహారం ఆప్ వర్సెస్ బీజేపీగా మారింది. దీనిపై ఫిర్యాదు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ సహాయకుడిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేయడంతో పాటు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా బుధవారం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్గా పని చేసిన ఓ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ఆమెకు మద్దతు ఇచ్చేందుకు మేం ఉన్నామని, ఈ ఘటనను ఆప్ నేత సంజయ్ సింగ్ అంగీకరించారని, కేజ్రీవాల్ నిందితుడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని సచ్దేవా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!