Atishi Singh: అప్పుడు ఢిల్లీలో.. ఇప్పుడు తెలంగాణలో “ఆపరేషన్ లోటస్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP MLA criticizes TRS party MLAs purchase case: బీజేపీ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ లోటస్’ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బట్టబయలు చేశారని అన్నారు ఆప్ ఎమ్మెల్యే అతిషి సింగ్. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లను ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆఫర్ ఢిల్లీ సీఎం ముందుకు తీసుకువచ్చారని ఆమె అన్నారు. మొత్తం సీబీఐ, ఈడీ కేసులు మూసేస్తామని.. బీజేపీ నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆమె విమర్శించారు. మనీష్ సిసోడియాను సీబీఐ పిలిచిన సందర్భంలో కూడా ఇలాంటి ప్రతిపాదనే చేశారని అతిషి సింగ్ అన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో కూడా ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు రూ. 25 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆపరేషన్ లోటస్ బట్టబయలైందని ఆన్నారు. బీజేపీ దళారులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. దళారుల నుంచి కోట్ల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ముగ్గురు దళారులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందని.. దళారుల ఆడియోలు కూడా బహిర్గతం అయ్యాయని ఎమ్మెల్యే అతిషి సింగ్ అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ. 100 కోట్ల నగదును తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. పైలెట్ రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియోలో అనేక అంశాలు ఉన్నాయని అన్నారు.
Also Read
- TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
Read Also: Myositis: సమంతకు వచ్చిన ‘మయోసైటిస్’ వ్యాధి అంటే ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
పార్టీలో చేరితే డబ్బులు, పదవులు, సెక్యూరిటీ కల్పిస్తామని హమీ ఇస్తామని చెప్పారని.. సీబీఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారని.. గతంలో వెస్ట్ బెంగాల్ లో సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాతే ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. అలాగే మనీష్ సిసోడియాకు కూడా ఆఫర్ చేశారని విమర్శించారు. పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకువస్తే బీఎల్ సంతోష్ తో మీటింగ్, నంబర్ 2తో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారని.. కేంద్ర హోం శాఖ మంత్రి దేశంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పని మీద దృష్టి పెట్టారా..? అని ప్రశ్నించారు.
తెలంగాణలో చేసిన విధంగానే ఢిల్లీలో చేస్తున్నామని చెప్పారు.. ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఈడీ, సీబీఐ సోదాలు చేయాలని.. కేంద్ర హోం మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణలో ఆపరేషన్ లోటస్ విఫలం అయిందని అన్నారు.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!