Atishi Singh: అప్పుడు ఢిల్లీలో.. ఇప్పుడు తెలంగాణలో “ఆపరేషన్ లోటస్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP MLA criticizes TRS party MLAs purchase case: బీజేపీ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ లోటస్’ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బట్టబయలు చేశారని అన్నారు ఆప్ ఎమ్మెల్యే అతిషి సింగ్. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లను ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆఫర్ ఢిల్లీ సీఎం ముందుకు తీసుకువచ్చారని ఆమె అన్నారు. మొత్తం సీబీఐ, ఈడీ కేసులు మూసేస్తామని.. బీజేపీ నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆమె విమర్శించారు. మనీష్ సిసోడియాను సీబీఐ పిలిచిన సందర్భంలో కూడా ఇలాంటి ప్రతిపాదనే చేశారని అతిషి సింగ్ అన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో కూడా ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు రూ. 25 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆపరేషన్ లోటస్ బట్టబయలైందని ఆన్నారు. బీజేపీ దళారులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. దళారుల నుంచి కోట్ల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ముగ్గురు దళారులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందని.. దళారుల ఆడియోలు కూడా బహిర్గతం అయ్యాయని ఎమ్మెల్యే అతిషి సింగ్ అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ. 100 కోట్ల నగదును తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. పైలెట్ రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియోలో అనేక అంశాలు ఉన్నాయని అన్నారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Myositis: సమంతకు వచ్చిన ‘మయోసైటిస్’ వ్యాధి అంటే ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
పార్టీలో చేరితే డబ్బులు, పదవులు, సెక్యూరిటీ కల్పిస్తామని హమీ ఇస్తామని చెప్పారని.. సీబీఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారని.. గతంలో వెస్ట్ బెంగాల్ లో సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాతే ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. అలాగే మనీష్ సిసోడియాకు కూడా ఆఫర్ చేశారని విమర్శించారు. పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకువస్తే బీఎల్ సంతోష్ తో మీటింగ్, నంబర్ 2తో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారని.. కేంద్ర హోం శాఖ మంత్రి దేశంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పని మీద దృష్టి పెట్టారా..? అని ప్రశ్నించారు.
తెలంగాణలో చేసిన విధంగానే ఢిల్లీలో చేస్తున్నామని చెప్పారు.. ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఈడీ, సీబీఐ సోదాలు చేయాలని.. కేంద్ర హోం మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణలో ఆపరేషన్ లోటస్ విఫలం అయిందని అన్నారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!