Reels: రీల్స్ మోజులో ప్రాణాలు పొగొట్టుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels: బయటి ప్రపంచానికి తెలియాలంటే వెంటనే గుర్తొచ్చేది సోషల్ మీడియా. అందులోనూ రీల్స్ చేస్తే బయటి ప్రపంచానికి త్వరగా తెలుస్తామని నేటి యువత రీల్స్ మోజులో పడిపోయింది. యువతే కాదు.. అన్ని వయస్సుల వారు.. ఆడ, మగ అని తేడా లేకుండా.. వయస్సుతో సంబంధం లేకుండా రీల్స్ చేస్తున్నారు. అయితే రీల్స్ చేసే టైంలో కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. కొందరు ఏకంగా ప్రాణాలనే పొగొట్టుకుంటున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అటువంటి సంఘటనే మహారాష్ర్టలో జరిగింది. రీల్స్ కోసం పాతబడిన బావిపైకి ఎక్కి రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు భావిలోపడి మరణించాడు. 32 గంటల తరువాత శవాన్ని బయటికి తీశారు పోలీసులు.
Read also: Avika Gor : సల్మాన్ ఖాన్ చిత్రం నుంచి అవికాను అందుకే తీసేశారట
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఓ ప్రమాదక స్టంట్ చేశాడు ఆ యువకుడు. సాగరసంగమం సినిమాలో కమల్ హాసన్ మాదిరి బావిపైకి ఎక్కి.. స్టెప్పులేస్తూ.. రీల్స్ చేయబోయాడు… కానీ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మహారాష్ట్రలోని డోంబివిలీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని డోంబీవలీ పరిధిలోని ఠాకురలీ ప్రాంతానికి చెందిన 18 సంవత్సరాల బిలాల్ సోహేల్ షేక్ అనే టీనేజర్ కు రీల్స్ అంటే తెగ పిచ్చి. సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ కావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. రకరకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జూన్ 11 న తన సోషల్ మీడియా ఖాతా కోసం రీల్ షూట్ చేయడానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ముంబ్రాలోని చాంద్నగర్ సమీపంలోని బ్రిటీష్ కాలం నాటి పంప్ హౌస్కు అనుసంధానంగా ఉన్న బావి వద్దకు వచ్చాడు. అనంతరం బావిపై స్టెప్పులేస్తూ.. రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో ప్రమాదశాత్తువు ఆ యువకుడు బావిలో పడి చనిపోయాడు. దాదాపు 32 గంటల తర్వాత పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.
Read also: IIIT Student: ట్రిపుల్ ఐటీ విద్యార్థినిల మరణాలు.. వీసీ వెంకట రమణ క్లారిటీ
ఈ కేసు గురించి విష్ణునగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పండినాథ్ భలేరావు మాట్లాడుతూ.. బిలాల్ బావిలో పడిపోవడాన్ని చూసిన ఇద్దరు స్నేహితులు సహాయం కోసం సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లారని తెలిపారు. దీంతో గార్డు విష్ణు నగర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి వెంటనే వెతుకులాట ప్రారంభించాడు. ముంబ్రాలోని చాంద్నగర్కు చెందిన ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పంప్ హౌజ్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. డోంబివిలి అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ.. తమ బృందం బాలుడి మృతదేహం కోసం ఒకరోజుకు పైగా వెతికిందని.. ఘటన జరిగిన 32 గంటల తర్వాత జూన్ 12 సాయంత్రం అతడి మృతదేహం లభ్యమైందని తెలిపారు. చాంద్నగర్ వాసులు బిలాల్ను రీల్ స్టార్గా చూశారని పోలీసులు తెలిపారు. దుర్ఘటనపై బిలాల్ మామ ఖలీద్ మాట్లాడుతూ బిలాల్ తన హితులతో కలిసి ఠాకూర్లీకి వెళ్తున్నట్లు మాతో చెప్పాడు. రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నాం. ఆ తర్వాత అతని స్నేహితులు ఈ సంఘటన గురించి చెప్పినప్పుడు, మేము షాక్ అయ్యాము. తన కుటుంబం పడుతున్న బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని .. అతను ఈ లోకంలో లేడని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామన్నారు.
- Tags
- ACCIDENT
- life
- police
- reels
- Young People
తాజావార్తలు
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..