IIIT Student: ట్రిపుల్ ఐటీ విద్యార్థినిల మరణాలు.. వీసీ వెంకట రమణ క్లారిటీ
IIIT Student: బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ట్రిపుల్ ఐటీ లోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వీసి వెంకట రమణ స్పందించారు. లిఖిత అనే విద్యార్ధిని నాల్గవ అంతస్తు పై నుంచి ప్రమాదశాత్తు పడి చనిపోయిందని తెలిపారు. లిఖిత ఫోన్ చూస్తుండగానే భవనంపై నుంచి జారిపడిందని చెప్పాడు. ప్రమాదంలో లిఖిత వీపు భాగం దెబ్బతిందని తెలిపారు. విద్యార్థుల మృతి బాధాకరమని వీసీ అన్నారు. హాస్టల్ భవనాలకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తమ వంతు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
దీపికా మృతి పై ప్రాధమిక నివేదిక వచ్చిందని, దీపికా పరిక్ష హాల్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్ళిందని తెలిపారు. పరీక్ష నియమాలు పాటించాలని కౌన్సిలింగ్ కోసం పరిపాలన భవనంను తీసుకెళ్లారని అన్నారు. దీపికా వాష్ రూమ్ కి వెల్లివస్తా అని చెప్పి క్షణికావేశంలో ఉరి వేసుకుని చనిపోయిందని స్పష్టంచేశారు. డైరెక్టర్ పదవి కాలం ముగుస్తుందని, దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. డైరెక్టర్, వీసి మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీ లో కొన్ని గ్యాప్ లు ఉన్నాయని, గతం కంటే పరిస్థితి బాగా మెరుగైందన్నారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షా విధానంలో మార్పుల వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ స్థాయి లో సెమిస్టర్ విధానం వద్దు అనుకున్నామని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కొరకు సెమిస్టర్ విధానం ను రద్దు చేసుకున్నామని స్పష్టం చేశారు.
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
బాసర ట్రిపుల్ ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని అన్నారు. మొన్న జరిగిన పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక మూత్రశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కమిటీ వేశామని.. విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదని అన్నారు. పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాత మీడియా సమావేశం అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. ఏదిఏమైనా విద్యార్థులు సమన్వయం పాటించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
Astrology : జూన్ 16, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
-
Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
-
KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
-
LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
-
Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!