IIIT Student: ట్రిపుల్ ఐటీ విద్యార్థినిల మరణాలు.. వీసీ వెంకట రమణ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIIT Student: బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ట్రిపుల్ ఐటీ లోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వీసి వెంకట రమణ స్పందించారు. లిఖిత అనే విద్యార్ధిని నాల్గవ అంతస్తు పై నుంచి ప్రమాదశాత్తు పడి చనిపోయిందని తెలిపారు. లిఖిత ఫోన్ చూస్తుండగానే భవనంపై నుంచి జారిపడిందని చెప్పాడు. ప్రమాదంలో లిఖిత వీపు భాగం దెబ్బతిందని తెలిపారు. విద్యార్థుల మృతి బాధాకరమని వీసీ అన్నారు. హాస్టల్ భవనాలకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తమ వంతు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
దీపికా మృతి పై ప్రాధమిక నివేదిక వచ్చిందని, దీపికా పరిక్ష హాల్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్ళిందని తెలిపారు. పరీక్ష నియమాలు పాటించాలని కౌన్సిలింగ్ కోసం పరిపాలన భవనంను తీసుకెళ్లారని అన్నారు. దీపికా వాష్ రూమ్ కి వెల్లివస్తా అని చెప్పి క్షణికావేశంలో ఉరి వేసుకుని చనిపోయిందని స్పష్టంచేశారు. డైరెక్టర్ పదవి కాలం ముగుస్తుందని, దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. డైరెక్టర్, వీసి మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీ లో కొన్ని గ్యాప్ లు ఉన్నాయని, గతం కంటే పరిస్థితి బాగా మెరుగైందన్నారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షా విధానంలో మార్పుల వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ స్థాయి లో సెమిస్టర్ విధానం వద్దు అనుకున్నామని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కొరకు సెమిస్టర్ విధానం ను రద్దు చేసుకున్నామని స్పష్టం చేశారు.
Also Read
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- Off The Record : నిశ్శబ్ద విప్లవమా.. వ్యూహాత్మక విస్తరణా? తెలంగాణలో బీజేపీ దూకుడు
బాసర ట్రిపుల్ ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని అన్నారు. మొన్న జరిగిన పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక మూత్రశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కమిటీ వేశామని.. విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదని అన్నారు. పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాత మీడియా సమావేశం అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. ఏదిఏమైనా విద్యార్థులు సమన్వయం పాటించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
Astrology : జూన్ 16, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!