School Bus Accident: కారును ఢీకొట్టిన పాఠశాల బస్సు…. ప్రమాదంలో ఆరుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Bus Accident: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రయాణీకులు మరణిస్తూనే ఉన్నారు. రోడ్డు ప్రమాదాలకు ర్యాష్ డ్రైవింగ్తోపాటు.. వాతావరణ పరిస్థితులు సరిగా ఉండకపోవడం..రోడ్లు సక్రమంగా ఉండకపోవడం కూడా కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు, స్కూల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
Read also: Suchitra Krishnamoorthi: ఇష్టంతో పెళ్లి చేసుకుంటే.. మోసం చేసి వెళ్లిపోయాడు
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఘజియాబాద్ లో మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.స్కూల్ బస్సు ఎస్యూవీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేపై రాహుల్ విహార్ సమీపంలో ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న మృతదేహలను వెలికితీయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కారు డోర్లను కట్ చేసి మృతదేహలను వెలికి తీశారు. .ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్కూల్ బస్సు డ్రైవర్ ఢిల్లీలోని ఘాజీపూర్ నుండి రాంగ్ రూట్ లో బస్సును తీసుకువస్తున్నాడని పోలీసులు చెప్పారు.కారు మీరట్ నుండి గురుగ్రామ్ వరకు వెళ్తుంది. రాంగ్ రూట్ లో బస్సు రావడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టినట్టుగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామానంద్ కుష్వా పేర్కొన్నారు. సోమవారంనాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ఘడ్ లోని లీలాపూర్ లో టెంపో పై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు.లక్నో- వారణాసి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రానికి 15 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలను ఎక్స్ గ్రేషియాను యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!