Asaduddin Owaisi: “మీ అన్న అమేథీలో ఓడిపోయారు”.. ప్రియాంకాగాంధీపై ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ప్రియాంకాగా గాంధీ మాట్లాడుతూ.. కీలక నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం, బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నియోజకవర్గంలో ఓడిపోవడాన్ని ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు.
అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడు ఆ నియోజకవర్గంలో తన పార్టీ కానీ, తాను కానీ పోటీ చేయలేదనే విషయాన్ని ఓవైసీ ఎత్తి చూపారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో లౌకిక రహిత పొత్తులు పెట్టుకున్నందుకు కాంగ్రెస్ని విమర్శించారు. ‘‘ ప్రియాంకా గాంధీ వాద్రా, మీ అన్న అమేథీలో ఓడిపోయారు. నేను వచ్చి అక్కడ పోరాడానా..? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేతో మీకు పొత్తు ఉంది. అతను లౌకికవాదా..? ఇదే శివసేన కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీని ధ్వంసం చేశారు. మీరు వారితో ఉన్నారు’’ అని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
Read Also: Kejriwal: కేజ్రీవాల్ బెయిల్కు కండీషన్స్ అప్లై.. సుప్రీం ఏం చెప్పిందంటే..!
మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఆప్ జమ్మూ కాశ్మీ్ర్లో ఆర్టికల్ 370ని తొలగించడంలో బీజేపీకి సాయం చేసింది. మీరు మమ్మల్ని బీజేపీ B-టీమ్ అని పిలుస్తారా..? అని అసద్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మీరు బీజేపీపై పోటీ చేసి 92 శాతం స్థానాల్లో ఓడిపోయారు. ఈ సారి 300 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఈ సారి ఎన్ని గెలుస్తారో చెప్పండి అంటూ ప్రశ్నించారు.
యూపీలోని రాయ్బరేలీలో ప్రియాంకా గాంధీ ప్రచారం చేస్తూ బీజేపీతో కలిసి ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించిన నేపథ్యంలో అసదుద్దీన్ నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. ‘‘ఓవైసీ నేరుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ఇతర పార్టీలను వెనక్కి నెట్టడానికి బీజేపీని గెలిపించేందుకు అతను పనిచేస్తున్నాడు. ఇది తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా ఉంది’’ అని ఆమె ఆరోపించారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!