CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై ఉన్నతాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించిన సీఎం, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 31 కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు సీఎం గుర్తు చేశారు. త్వరలోనే మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోపు సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక సిబ్బంది నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక, డీఎస్సీ నియామకాల అంశంపై వైసీపీ చేస్తున్న విమర్శలను మంత్రులు సీరియస్గా తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు… ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే వాస్తవాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ విమర్శలు చేస్తోందని, వాటికి సమర్థవంతంగా కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రులకు సూచించినట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు రెండు వారాల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంత్రులు ఏ జిల్లాలో ఉన్నా ప్రభుత్వ పథకాల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!