Asaduddin Owaisi: “మీ అన్న అమేథీలో ఓడిపోయారు”.. ప్రియాంకాగాంధీపై ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ప్రియాంకాగా గాంధీ మాట్లాడుతూ.. కీలక నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం, బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నియోజకవర్గంలో ఓడిపోవడాన్ని ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు.
అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడు ఆ నియోజకవర్గంలో తన పార్టీ కానీ, తాను కానీ పోటీ చేయలేదనే విషయాన్ని ఓవైసీ ఎత్తి చూపారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో లౌకిక రహిత పొత్తులు పెట్టుకున్నందుకు కాంగ్రెస్ని విమర్శించారు. ‘‘ ప్రియాంకా గాంధీ వాద్రా, మీ అన్న అమేథీలో ఓడిపోయారు. నేను వచ్చి అక్కడ పోరాడానా..? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేతో మీకు పొత్తు ఉంది. అతను లౌకికవాదా..? ఇదే శివసేన కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీని ధ్వంసం చేశారు. మీరు వారితో ఉన్నారు’’ అని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Kejriwal: కేజ్రీవాల్ బెయిల్కు కండీషన్స్ అప్లై.. సుప్రీం ఏం చెప్పిందంటే..!
మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఆప్ జమ్మూ కాశ్మీ్ర్లో ఆర్టికల్ 370ని తొలగించడంలో బీజేపీకి సాయం చేసింది. మీరు మమ్మల్ని బీజేపీ B-టీమ్ అని పిలుస్తారా..? అని అసద్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మీరు బీజేపీపై పోటీ చేసి 92 శాతం స్థానాల్లో ఓడిపోయారు. ఈ సారి 300 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఈ సారి ఎన్ని గెలుస్తారో చెప్పండి అంటూ ప్రశ్నించారు.
యూపీలోని రాయ్బరేలీలో ప్రియాంకా గాంధీ ప్రచారం చేస్తూ బీజేపీతో కలిసి ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించిన నేపథ్యంలో అసదుద్దీన్ నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. ‘‘ఓవైసీ నేరుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ఇతర పార్టీలను వెనక్కి నెట్టడానికి బీజేపీని గెలిపించేందుకు అతను పనిచేస్తున్నాడు. ఇది తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా ఉంది’’ అని ఆమె ఆరోపించారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..