Uttar Pradesh: మ్యాన్హోల్లో పడి మునిగిన జంట.. ప్రభుత్వంపై నెటిజన్లు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుడప్పుడు మ్యాన్హోల్స్లో వాహనాలు పడిపోవడం, మనుషులు మునిగిపోవడం లాంటి సంఘటనలు వెలుగుచూడటాన్ని మనం చూశాం. ఇలాంటివి ఎన్ని జరిగినా, ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ ఘోర ప్రమాదమే చోటు చేసుకుంది. ఏకంగా ఓ జంట నీటి గుంతలో పడిపోయింది. అదృష్టవశాత్తూ చుట్టుపక్కలున్న వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. అలీఘఢ్లోని కిషన్పూర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలోనే ఆ నీరు పోయేందుకు మ్యాన్హోల్స్ తెరిచారు. అయితే, ప్రమాద హెచ్చరికలు మాత్రం పెట్టలేదు. ఈ క్రమంలోనే స్కూటీలో అటుగా వచ్చిన ఓ జంట.. ఆ నీటి గుంతలో పడిపోయింది. ఆ దంపతుల పేర్లు దయానంద్ సింగ్ అత్రి, అంజు అత్రి. స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన ఈ దంపతులు.. రోడ్డు పక్కగా తమ వాహనాన్ని పార్క్ చేసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తెరిచి ఉన్న మ్యాన్హోల్లో ఆ దంపతులు స్కూటీతో పాటు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. అక్కడికి చేరుకొని వారిని కాపాడారు. దీంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. అధికారంలోకి రాకముందు అది చేస్తాం, ఇది చేస్తామంటూ వాగ్ధానాలు చేసే రాజకీయ నాయకులు.. అధికారం వచ్చాక ప్రజల్ని పట్టించుకోవడం మానేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్హోల్స్లో ఏకంగా ఓ జంట పడిపోయిందంటే, అభివృద్ధి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చంటూ కౌంటర్స్ వేస్తున్నారు.
Visuals from UP's Aligarh.
Leaving this here. pic.twitter.com/bOhACL96IW
— Piyush Rai (@Benarasiyaa) June 18, 2022
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!