Delhi: ఢిల్లీలో బాలుడు హత్య.. ఇళ్లపై ‘హిందూ’ పోస్టర్లు కలకలం
- ఢిల్లీలో బాలుడు హత్య
- ఇళ్లపై ‘హిందూ’ పోస్టర్లు కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి(17) హత్య తీవ్ర కలకలం రేపింది. సీలంపూర్లో బాలుడిని కొందరు దుండగులు చంపేసి పరారయ్యారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. హిందువులు వలస వెళ్లిపోతున్నారంటూ రాతలు రాశారు. అంతేకాకుండా ఇళ్లపై కూడా అంటించిన దృశ్యాలు కనిపించాయి. యూపీ సీఎం యోగీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. పెద్ద ఎత్తున మోహరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
హతుడు ముస్లిం వర్గానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. నిందితులు బాధితుడికి తెలిసిన వారేనని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వారు మైనర్లా లేకుంటే పెద్దవారా? అనే అంశంపై దర్యాప్తు చేస్తు్న్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. హత్యకు సంబంధించి తాను పోలీస్ కమిషనర్తో మాట్లాడానని, నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయని ముఖ్యమంత్రి ధృవీకరించారు. పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని.. కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని సీఎం హామీ ఇచ్చారు.
హత్య వెనుక లేడీ డాన్?
బాధితుడి తల్లి మాట్లాడుతూ.. ఇల్లు అమ్మేసి వెళ్లిపోతున్నామని.. ఇంతలోనే తన కొడుకు హత్యకు గురయ్యాడని వాపోయింది. తన కొడుకుపై వేరే వాళ్లు ద్వేషాన్ని రగిలించారని.. ఇందులో భాగంగానే పాలు తెచ్చేందుకు బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడని తెలిపింది. ఇక తండ్రి రాజ్బీర్ సింగ్ మాట్లాడుతూ.. తన కొడుకును 4-5 మంది అబ్బాయిలు కత్తితో పొడిచి చంపడం చూసినట్లు తెలిపాడు. ఇప్పటికే చాలా మంది హిందువులు ఇళ్లను అమ్మేసి వెళ్లిపోయారని.. చాలా మంది వెళ్లిపోవాలనే ఇలా చేస్తున్నారని పేర్కొన్నాడు. ఘటనాస్థలిలో జిక్రా అనే అమ్మాయి కూడా కనిపించిందన్నాడు. తన కొడుకుకు ఎవరితోనూ శత్రుత్వం లేకపోయినా.. జిక్రా బెదిరించిందని వాపోయాడు. జిక్రాను లేడీడాన్గా పిలుస్తుంటారు. అయితే పోలీసులు విచారించి జిక్రా పాత్ర లేదని వదిలిపెట్టేశారు.
బాలుడికి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు, సోదరి ఉంది. సీలంపూర్లో నివాసం ఉంటున్నారు. గాంధీనగర్లోని ఒక బట్టల షాపులో పని చేస్తుంటాడు. గురువారం రాత్రి పాలు కొనేందుకు షాపుకు వెళ్లి హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
#WATCH | Delhi: A 17-year-old boy was stabbed to death in Seelampur, kin of the victim blocked the road after the incident; security heightened in the area (17/04) https://t.co/7LtDIGr4ZI pic.twitter.com/SFW6R4wepQ
— ANI (@ANI) April 17, 2025
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!