Delhi: ఢిల్లీలో బాలుడు హత్య.. ఇళ్లపై ‘హిందూ’ పోస్టర్లు కలకలం
- ఢిల్లీలో బాలుడు హత్య
- ఇళ్లపై ‘హిందూ’ పోస్టర్లు కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి(17) హత్య తీవ్ర కలకలం రేపింది. సీలంపూర్లో బాలుడిని కొందరు దుండగులు చంపేసి పరారయ్యారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. హిందువులు వలస వెళ్లిపోతున్నారంటూ రాతలు రాశారు. అంతేకాకుండా ఇళ్లపై కూడా అంటించిన దృశ్యాలు కనిపించాయి. యూపీ సీఎం యోగీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. పెద్ద ఎత్తున మోహరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also Read
హతుడు ముస్లిం వర్గానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. నిందితులు బాధితుడికి తెలిసిన వారేనని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వారు మైనర్లా లేకుంటే పెద్దవారా? అనే అంశంపై దర్యాప్తు చేస్తు్న్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. హత్యకు సంబంధించి తాను పోలీస్ కమిషనర్తో మాట్లాడానని, నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయని ముఖ్యమంత్రి ధృవీకరించారు. పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని.. కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని సీఎం హామీ ఇచ్చారు.
హత్య వెనుక లేడీ డాన్?
బాధితుడి తల్లి మాట్లాడుతూ.. ఇల్లు అమ్మేసి వెళ్లిపోతున్నామని.. ఇంతలోనే తన కొడుకు హత్యకు గురయ్యాడని వాపోయింది. తన కొడుకుపై వేరే వాళ్లు ద్వేషాన్ని రగిలించారని.. ఇందులో భాగంగానే పాలు తెచ్చేందుకు బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడని తెలిపింది. ఇక తండ్రి రాజ్బీర్ సింగ్ మాట్లాడుతూ.. తన కొడుకును 4-5 మంది అబ్బాయిలు కత్తితో పొడిచి చంపడం చూసినట్లు తెలిపాడు. ఇప్పటికే చాలా మంది హిందువులు ఇళ్లను అమ్మేసి వెళ్లిపోయారని.. చాలా మంది వెళ్లిపోవాలనే ఇలా చేస్తున్నారని పేర్కొన్నాడు. ఘటనాస్థలిలో జిక్రా అనే అమ్మాయి కూడా కనిపించిందన్నాడు. తన కొడుకుకు ఎవరితోనూ శత్రుత్వం లేకపోయినా.. జిక్రా బెదిరించిందని వాపోయాడు. జిక్రాను లేడీడాన్గా పిలుస్తుంటారు. అయితే పోలీసులు విచారించి జిక్రా పాత్ర లేదని వదిలిపెట్టేశారు.
బాలుడికి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు, సోదరి ఉంది. సీలంపూర్లో నివాసం ఉంటున్నారు. గాంధీనగర్లోని ఒక బట్టల షాపులో పని చేస్తుంటాడు. గురువారం రాత్రి పాలు కొనేందుకు షాపుకు వెళ్లి హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
#WATCH | Delhi: A 17-year-old boy was stabbed to death in Seelampur, kin of the victim blocked the road after the incident; security heightened in the area (17/04) https://t.co/7LtDIGr4ZI pic.twitter.com/SFW6R4wepQ
— ANI (@ANI) April 17, 2025
తాజావార్తలు
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!