Heart Attack: ఇటీవల కాలంలో ఉన్నట్లుండి యువత గుండెపోటుకు గురవుతోంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఓ కాలేజీ విద్యార్థిని స్పీచ్ ఇస్తూనే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. 20 ఏళ్ల విద్యార్థిని వర్ష ఖరత్ ప్రసంగం మధ్యలో నవ్వుతూ కనిపించింది. ప్రసంగిస్తూనే, హార్ట్ ఎటాక్ రావడంతో మరణించింది.
Read Also: Sreeleela : దారుణం.. శ్రీలీలను అక్కడ పట్టుకుని లాగిన ఆకతాయిలు..
ఈ ఘటన ధరాశివ్ నగరంలో జరిగింది. ఒక కార్యక్రమంలో గుండెపోటు రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పరాండ తాలూకాలోని మహర్షి గురువర్య ఆర్జీ షిండే మహావిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో వర్ష ఖరత్ మరాఠీలో ప్రసంగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రసంగానికి ప్రేక్షకులు నవ్వడం ప్రారంభించారు. ప్రసంగంలోనే ఆమె నెమ్మదిగా నేలపై కుప్పకూలింది. వెంటనే ప్రేక్షకులు ఆమెను వైద్యం కోసం తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
At RG Shinde College in Dharashiv, Maharashtra, a student, Varsha Kharat, collapsed and died during her farewell speech 😢😢https://t.co/O4Rx9pmtnp#suddendeath https://t.co/gPlhM9qaGh pic.twitter.com/fcCdm6PWFX
— Dee (@DeeEternalOpt) April 5, 2025