NTV Telugu Site icon

Chhattisgarh: మావోలకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 8 మంది హతం

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఓ వైపు భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నా… మావోలు మాత్రం కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతం అయ్యారు.

ఇది కూడా చదవండి: Sai Pallavi: “లేడీ పవర్ స్టార్” సాయి పల్లవికి అనారోగ్యం..

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Rammohan Naidu : బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం.. ఇప్పటికే 15వేల కోట్లు..