Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 66 Crore People Took Holy Dip In Maha Kumbh Mela

Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!

Published Date :February 27, 2025 , 1:06 pm
By Suresh Maddala
  • మహా కుంభమేళాలో 66 కోట్ల మంది పుణ్య స్నానాలు
  • రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు
  • 60 లక్షల మందికిపైగా జీవనోపాధి
Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతేకాకుండా కోట్లలో బిజినెస్ కూడా నడిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ఇది కూడా చదవండి: KTR: రేవంత్‌రెడ్డి ధన దాహం వల్లే.. ప్రమాదంలో 8 మంది కార్మికుల ప్రాణాలు!

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగంలో దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచాయని పేర్కొంది. పరోక్షంగా.. ప్రత్యక్షంగా 60 లక్షల మంది జీవనోపాధి పొందినట్లుగా వెల్లడించింది. దాదాపు 150 కి.మీ మేర వ్యాపారాలు జరిగాయని పేర్కొంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద మతపరమైన పండుగ ఇదేనని పరమార్థ నికేతన్ అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ప్రయాగ్‌రాజ్ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పారు.

యాత్రికులకు ఆర్థిక సౌలభ్యం కల్పించడానికి 16 బ్యాంకులు ప్రాంగణంలో శాఖలను ఏర్పాటు చేశాయి. ఈ బ్యాంకులు రూ. 37 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించాయి. వీటిలో ఎక్కువ డిపాజిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో నమోదయ్యాయి. గణనీయమైన సంఖ్యలో భక్తులు నగదు జమ చేశారని, ఉపసంహరణలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మైదానంలో 50 మొబైల్ ATMలతో సహా 55 ATM బూత్‌లు ఏర్పాటు చేశారు. అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ATMలకు డిమాండ్ తక్కువగా ఉంది. కొన్ని ATMలకు వారం తర్వాత మాత్రమే రీఫిల్ చేయాల్సి వచ్చింది. డిజిటల్ చెల్లింపుల వైపే మక్కువ చూపించారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: “తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు”.. HCL టెక్ క్యాంపస్ ప్రారంభించిన సీఎం..

ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారతీయ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వంపై అంతర్జాతీయంగా ఆసక్తిని కనుబరిచారు. భూటాన్ రాజు, వివిధ దేశాల మంత్రులు మరియు ప్రముఖులతో కలిసి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. నేపాల్ నుంచి 50 లక్షలకు పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించగా… 27 ఇతర దేశాల నుంచి రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య సందర్శించారు.

అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అనేక మంది కేంద్ర మంత్రులు సహా భారతదేశ అగ్ర నాయకత్వం పాల్గొంది. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

తాజాగా దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘మహా కుంభమేళా పూర్తయింది. ఐక్యత మహా యజ్ఞం పూర్తయింది. 45 రోజుల పాటూ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో 140 కోట్ల దేశ ప్రజల విశ్వాసం అద్భుతమైంది.’’ అంటూ కొనియాడుతూ మోడీ రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Pune Rape Case: నిందితుడి ఫొటో విడుదల.. ఆచూకీ చెబితే రివార్డు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 66 crore people holy dip
  • Maha Kumbh Mela 2025
  • PM Modi
  • UP

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions