Indian students: గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థులు మృత్యువాత..
- విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ మృత్యువాత..
- గత ఐదేళ్లలో ఇప్పటి వరకు 633 మంది విద్యార్థులు విదేశాల్లో మృతి..
- రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian students: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం లాంటి.. పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో ఇప్పటి వరకు 633 మంది విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లుగా కేంద్ర సర్కార్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
Read Also: Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్ అప్డేట్స్
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో మొత్తం 633 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపగా.. అందులో అత్యధికంగా కెనడాలో 172 మంది మరణించగా.. ఆ తర్వాత యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్లో ఒకరు చొప్పున విద్యార్థులు విడిచారు. ఇటీవల విదేశాల్లో ఇండియన్ స్టూడెంట్స్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీయుల దాడిలో కెనడాలో 9 మంది, యూఎస్లో 6, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో ఒక్కొక్కరు చొప్పున 19 మంది మరణించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ వెల్లడించారు.
Read Also: Deadpool & Wolverine Review: డెడ్ పూల్ వాల్వరిన్ రివ్యూ.. కుర్చీ మడత పెట్టాడా? లేదా?
విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత రాయబరి కార్యాలయాలు వెంటనే రియాక్ట్ అయి.. తగిన చర్యలు తీసుకుని.. నేరస్థులకు శిక్ష పడేలా చూస్తాయని కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్థన్ చెప్పారు. ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా (ఉక్రెయిన్), ఆపరేషన్ అజయ్ (ఇజ్రాయెల్) ద్వారా ప్రపంచదేశాల్లో ఇబ్బంది పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్ ను స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు MADAD పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకుంటే వారి సమస్యలపై మన ఏజెన్సీలు వెంటనే స్పందించే ఛాన్స్ ఉందన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!