Digital IDs: 61 మిలియన్ రైతులకు డిజిటల్ ఐడీలు.. కేంద్రం లక్ష్యం ఇదే!
- 61 మిలియన్ రైతులకు డిజిటల్ ఐడీలు
- కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం అగ్రికల్చర్కు ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. ఇండియాలో పండే పంటలు ఏ దేశంలోనూ పండవు. భారతీయ రైతులు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తుంటారు. ఇక రైతుల ఉత్సాహానికి ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందిస్తుంటాయి. కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తుంటే.. కొన్ని రాష్ట్రాలు ఉచిత విద్యుత్తో పాటు పెట్టుబడి సాయాలు అందిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: ISRO Recruitment 2025: B.Tech పాసైతే చాలు.. ఇస్రోలో 320 ఇంజనీర్ జాబ్స్ రెడీ..
Also Read
- Delhi Police: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్పై కేసు విషయంలో.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
అయితే కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో కర్షకులకు ఆధార్ కార్డు తరహాలో డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేసింది. దాదాపు దేశంలో 14 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 6.1 కోట్లకు పైగా రైతులకు ఈ డిజిటల్ ఐడీలను జారీ చేసింది. ఇందులో రైతుల భూ రికార్డులకు అనుసంధానించబడి ఉంటాయి. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా అగ్రి స్టాక్ కింద ఈ డిజిటల్ ఐడీలు ఇస్తున్నారు. భూమి రికార్డులు, పశువుల యాజమాన్యం, నాటిన పంటలు, పొందిన ప్రయోజనాలతో సహా వివిధ రైతు సంబంధిత డేటాకు ఇవి అనుసంధానించబడి ఉంటాయి. ఈ కార్డు క్రెడిట్, పంట బీమా, పీఎం కిసాన్ చెల్లింపులను వేగవంతం చేయడానికి సహాయపడనుంది.
ఇది కూడా చదవండి: India: ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1.46 ట్రిలియన్లకు చేరుకున్న రక్షణ ఉత్పత్తి..
ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 6.1 కోట్ల మందికి డిజిటల్ ఐడీలను భూమి రికార్డులతో అనుసంధించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2027 నాటికి 110 మిలియన్ల రైతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భూమి రికార్డులు, పంటల వివరాలతో ఇది అనుసంధానించబడుతుందని చెప్పారు. ఈ కార్డుతో క్రెడిట్, పంట బీమా, పీఎం కిసాన్ చెల్లింపులను వేగవంతం చేయడానికి సహాయపడనుందని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ (13 మిలియన్లు), మహారాష్ట్ర (9.9 మిలియన్లు), మధ్యప్రదేశ్ (8.3 మిలియన్లు), ఆంధ్రప్రదేశ్ (4.5 మిలియన్లు), గుజరాత్ (4.4 మిలియన్లు), రాజస్థాన్ (7.5 మిలియన్లు), తమిళనాడు (3 మిలియన్లు) రాష్ట్రాల్లో డిజిటల్ కార్డులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కేరళ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఐడీలను అందించడంలో పురోగతి సాధించాయని తెలిపారు.
తాజావార్తలు
-
August Movies : ఆగస్ట్లో స్ట్రయిట్ తెలుగు సినిమాల జాతర.. హిట్టు కొట్టేదెవరు?
-
Monday Fasting Drinks: సోమవారం ఉపవాస సమయంలో ఈ పానీయాలు తాగితే.. నీరసం, అలసట ఉండనే ఉండదు!
-
Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్టాప్ స్వాధీనం..!
-
India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ మార్పు.. 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్కు కీలక బాధ్యతలు!
-
Ramayana: నితేష్ తివారీ సినిమా వెనుక మరో సీక్రెట్.. అస్సాం చరిత్రకు ‘రామాయణం’తో సంబంధం ఉందా?
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!