Manipur: మణిపూర్లో మరోసారి అల్లర్లు.. ఆరుగురు మృతి
- మణిపూర్లో మరోసారి అల్లర్లు
- ఆరుగురు మృతి.. బలగాలు మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ మరోసారి రణరంగంగా మారుతోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు ఉద్రిక్తతలకు దారి తీసింది. డ్రోన్ దాడులను నిరసిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. హింసకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. హింస కొనసాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్.. బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
శనివారం ఉదయం మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో జరిగిన హింసలో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కుకీ తిరుగుబాటుదారులు రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 229 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని నుంగ్చప్పి గ్రామంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యురెంబమ్ కులేంద్ర సింఘా అనే 63 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అనంతరం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని మోయిరాంగ్ పట్టణంలో కుకీ తిరుగుబాటుదారులు.. ప్రార్థనలు చేస్తున్న లోయ-ఆధిపత్యమైన మైతీ కమ్యూనిటీకి చెందిన వృద్ధుడు మరణించిన ఒక రోజు తర్వాత ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. మెయిటీ కమ్యూనిటీకి చెందిన సాయుధ గ్రూపులు మరియు కొండ-ఆధిపత్య కుకీ తెగల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ బృందాలు తమకు తాముగా ‘గ్రామ రక్షణ వాలంటీర్లు’గా భావించుకుంటారు. మొత్తానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: TPCC Chief: ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తా..
జిరిబామ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి), పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపై కూడా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు ప్రకటనలో తెలిపారు. అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని గ్రామాలపై ఆయుధాలతో కూడిన డ్రోన్లతో దాడి చేసిన దాదాపు వారం తర్వాత ఆ ప్రాంతంలో డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ మోహరించింది. అనుమానిత తిరుగుబాటుదారులు భారత గడ్డపై మొదటిసారి డ్రోన్ దాడులను ప్రారంభించారు. చూరాచాంద్పుర్లోని మువాల్సంగ్, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. మూడు బంకర్లను కూల్చివేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో కారు బీభత్సం.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో యువకుడి మృతి
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!