Manipur: మణిపూర్లో మరోసారి అల్లర్లు.. ఆరుగురు మృతి
- మణిపూర్లో మరోసారి అల్లర్లు
- ఆరుగురు మృతి.. బలగాలు మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ మరోసారి రణరంగంగా మారుతోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు ఉద్రిక్తతలకు దారి తీసింది. డ్రోన్ దాడులను నిరసిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. హింసకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. హింస కొనసాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్.. బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు
Also Read
శనివారం ఉదయం మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో జరిగిన హింసలో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కుకీ తిరుగుబాటుదారులు రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 229 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని నుంగ్చప్పి గ్రామంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యురెంబమ్ కులేంద్ర సింఘా అనే 63 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అనంతరం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని మోయిరాంగ్ పట్టణంలో కుకీ తిరుగుబాటుదారులు.. ప్రార్థనలు చేస్తున్న లోయ-ఆధిపత్యమైన మైతీ కమ్యూనిటీకి చెందిన వృద్ధుడు మరణించిన ఒక రోజు తర్వాత ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. మెయిటీ కమ్యూనిటీకి చెందిన సాయుధ గ్రూపులు మరియు కొండ-ఆధిపత్య కుకీ తెగల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ బృందాలు తమకు తాముగా ‘గ్రామ రక్షణ వాలంటీర్లు’గా భావించుకుంటారు. మొత్తానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: TPCC Chief: ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తా..
జిరిబామ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి), పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపై కూడా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు ప్రకటనలో తెలిపారు. అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని గ్రామాలపై ఆయుధాలతో కూడిన డ్రోన్లతో దాడి చేసిన దాదాపు వారం తర్వాత ఆ ప్రాంతంలో డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ మోహరించింది. అనుమానిత తిరుగుబాటుదారులు భారత గడ్డపై మొదటిసారి డ్రోన్ దాడులను ప్రారంభించారు. చూరాచాంద్పుర్లోని మువాల్సంగ్, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. మూడు బంకర్లను కూల్చివేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో కారు బీభత్సం.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో యువకుడి మృతి
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!