Manipur: మణిపూర్లో మరోసారి అల్లర్లు.. ఆరుగురు మృతి
- మణిపూర్లో మరోసారి అల్లర్లు
- ఆరుగురు మృతి.. బలగాలు మోహరింపు
మణిపూర్ మరోసారి రణరంగంగా మారుతోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు ఉద్రిక్తతలకు దారి తీసింది. డ్రోన్ దాడులను నిరసిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. హింసకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. హింస కొనసాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్.. బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు
Also Read
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
శనివారం ఉదయం మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో జరిగిన హింసలో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కుకీ తిరుగుబాటుదారులు రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 229 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని నుంగ్చప్పి గ్రామంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యురెంబమ్ కులేంద్ర సింఘా అనే 63 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అనంతరం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని మోయిరాంగ్ పట్టణంలో కుకీ తిరుగుబాటుదారులు.. ప్రార్థనలు చేస్తున్న లోయ-ఆధిపత్యమైన మైతీ కమ్యూనిటీకి చెందిన వృద్ధుడు మరణించిన ఒక రోజు తర్వాత ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. మెయిటీ కమ్యూనిటీకి చెందిన సాయుధ గ్రూపులు మరియు కొండ-ఆధిపత్య కుకీ తెగల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ బృందాలు తమకు తాముగా ‘గ్రామ రక్షణ వాలంటీర్లు’గా భావించుకుంటారు. మొత్తానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: TPCC Chief: ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తా..
జిరిబామ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి), పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపై కూడా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు ప్రకటనలో తెలిపారు. అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని గ్రామాలపై ఆయుధాలతో కూడిన డ్రోన్లతో దాడి చేసిన దాదాపు వారం తర్వాత ఆ ప్రాంతంలో డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ మోహరించింది. అనుమానిత తిరుగుబాటుదారులు భారత గడ్డపై మొదటిసారి డ్రోన్ దాడులను ప్రారంభించారు. చూరాచాంద్పుర్లోని మువాల్సంగ్, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. మూడు బంకర్లను కూల్చివేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో కారు బీభత్సం.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో యువకుడి మృతి
తాజావార్తలు
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!