Encounter: శనివారం (2 అక్టోబర్ 2024) దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్లో రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కోకర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఇది కాకుండా, అనంతనాగ్లోని కచ్వాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ స్థలంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.…
మణిపూర్ మరోసారి రణరంగంగా మారుతోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు ఉద్రిక్తతలకు దారి తీసింది. డ్రోన్ దాడులను నిరసిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. హింసకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. హింస కొనసాగుతూనే ఉంది.