Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ జవాన్లకు గాయాలు..
- జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..
- కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు..భద్రతా బలగాలకు మధ్య కాల్పులు..
- నలుగురు జవాన్లకు గాయాలు..
- సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వరసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్లు ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన నలుగురిలో ఒకరిని చికిత్స కోసం సమీపంలో కమాండ్ ఆస్పత్రికి తరలించగా, మరో ముగ్గురు స్థానికంగా చికిత్స పొందుతున్నారు.
Read Also: Teacher: 16 ఏళ్ల స్టూడెంట్తో లేడీ టీచర్ శృంగారం.. తండ్రికి తెలిసినా..
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా శుక్రవారం తెల్లవారుజామున కిష్ట్వార్లోని చత్రూ ప్రాంతంలో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు ఉగ్రవాదుల తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. తాజాగా కిష్ట్వార్లో జరిగిన ఎన్కౌంటర్లో పాల్గొన్న ఉగ్రవాదులే జూలై నెలలో దోడాలో జరిగిన ఎన్కౌంటర్తో సంబంధం కలిగి ఉన్నారని తెలిసింది. దోడా ఎన్కౌంటర్లో ఒక అధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ నెలలో జమ్మా కాశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 10 ఏళ్ల తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి.
అంతకుముందు బుధవారం కథువా-ఉదంపూర్ సరిహద్దులోని బసంత్ గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పారామిలటరీ దళాలు మరియు పోలీసు సిబ్బంది బసంత్గఢ్కు చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది గాయపడిన కొద్ది గంటల తర్వాత ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Based on the intelligence inputs, a joint operation with J&K Police was launched in area Chatroo at #Kishtwar.
A contact was established and scout leading the patrol exchanged heavy volume of fire with the terrorists at 1530 hrs.
In the ensuing firefight four army personnel… pic.twitter.com/1KJn3M8UBo— White Knight Corps (@Whiteknight_IA) September 13, 2024
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..