Crime In Delhi: ఢిల్లీలో 24 గంటల్లోనే 3 హత్యలు.. శాంతిభద్రతలపై ఆప్ ఆగ్రహం..
- దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లోనే 3 హత్యలు..
- ఢిల్లీలో శాంతిభద్రతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్..
- బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు పెరిగాయి: అతిషి
Crime In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నాడు మూడు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అయితే, సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో జరిగిన చిన్న రోడ్డు ప్రమాదం తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో మహేంద్ర అనే వ్యక్తిని లక్కీ, సాగర్ అనే ఇద్దరు సోదరులు కలిసి స్క్రూ డ్రైవర్తో కొట్టి చంపేశారు. వీరు ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
Read Also: Russia-Ukraine: శాంతి ఒప్పందంపై అమెరికా సంచలన ప్రకటన
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అలాగే, సెంట్రల్ ఢిల్లీలోని పంజాబీ బస్తీలో జరిగిన రెండవ సంఘటనలో ఆశిష్ ఆనంద్ అనే వ్యక్తిని ప్లాన్ ప్రకారం కొందరు దుండగులు వచ్చి కత్తితో పొడిచి చంపారు.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇక, మూడో ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు కునాల్ని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం.. నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి రెండు బృందాలను నియమించామని పోలీసులు తెలిపారు. ఇక, సీఎం రేఖాగుప్తా సైతం ఈ వరుస మర్డర్లపై స్పందించింది. ఈ ఘటనలో కమిషనర్ తో మాట్లాడినట్లు పేర్కొనింది.
Read Also: Kishan Reddy: తెలంగాణలో మజ్లిస్ జండా ఎగురేయాలని అనుకుంటుంది.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్
ఇక, ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి అతిషి స్పందించారు. ఈ సందర్భంగా సీలంపూర్ హత్య దేశ రాజధానిలో శాంతిభద్రతల ఎలా ఉన్నాయె తెలియజేస్తుందన్నారు. వరుస హత్యలు జరుగుతుంటే.. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా నేరాలు పెరిగిపోతున్నాయని విమర్శలు గుప్పించింది. బీజేపీ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడటం లేదని ఆరోపించింది. తాము అధికారంలో ఉన్న పదేళ్లు శాంతియుత పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం అతిషి తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!