Cloudbursts: హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్.. కేదార్నాథ్లో చిక్కుకున్న 1600 మంది..
- హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్..
- ఉత్తరాఖండ్.. హిమాచల్ రాష్ట్రాల్లో మెరుపు వరదలు..
- 24 మంది మృతి.. గల్లంతైన వారి కోసం గాలింపు..
- రంగంలోకి దిగిన ఆర్మీ.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cloudbursts: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ‘‘క్లౌడ్ బరస్ట్’’తో మెరుపు వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరాఖండ్లోనే 15 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో కీలక రహదారుల్ని క్లోజ్ చేశారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also: Taj Mahal: షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని చల్లిన యువకులు..వీడియో వైరల్
Also Read
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
- CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
కేదార్నాథ్లో 1600 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. గౌరీకుండ్-హరిద్వార్ మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్ర ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 18 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతోంది. యాత్రికులను తరలించడానికి ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. మరోవైపు తప్పిపోయిన వారి కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 3000 మందిని రక్షించారు. కేదార్నాథ్ యాత్రని తాత్కాలికంగా మూసేశారు.
హిమాచల్ ప్రదేశ్ మండి-పండోహ్ మధ్య మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి జాతీయ రహదారిని గత రాత్రి నుంచి మూసేశారు. బాధితుల కోసం హిమాచల్ సీఎం సుఖ్విందర్ సుఖు తక్షణ సాయం కింద రూ.50,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఆగస్టు 6 వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల్ని జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని రాంపూర్ సమేజ్ గ్రామంలో ఎనిమిది మంది పాఠశాల విద్యార్థులు తప్పిపోయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అరవింద్ తెలిపారు. గల్లంతైన ఎనిమిది మందిలో ఏడుగురు బాలికలు కాగా, ఒక బాలుడు ఉన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..