Fishermens Arrest: శ్రీలంక నేవీ అదుపులో 22 మంది తమిళ మత్స్యకారులు..
- 22 మంది తమిళనాడు మత్య్సకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ..
- రెండు మెకనైజ్డ్ పడవలను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నావికాదళం..
- తొందరలోనే జాలర్లను విడిపిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishermens Arrest: సముద్ర సరిహద్దు దాటినందుకు గాను 22 మంది భారతీయ మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. భారత్- శ్రీలంక మధ్య లోతైన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తమిళ మత్స్యకారులను అరెస్టు చేశారని, వారి నుంచి రెండు మెకనైజ్డ్ పడవలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్నట్టు తరువైకులం మత్స్యకారుల సంఘం ప్రకటించింది. ఒక బ్యాచ్లో 12, మరో బ్యాచ్కు చెందిన 10 మందిని గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Read Also: Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్గా రికార్డు!
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
కాగా, ఈ ఘటనలపై తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. శ్రీలంక నేవీ నుంచి తమిళ మత్య్స కారులు ఎదుర్కొంటున్న నిరంతర దాడులపై చర్చించడానికి ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధులను కూడా ఆయనతో పాటు తీసుకుపోయారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై చర్చించిన తర్వాత.. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది రాజకీయ సమస్య కాకూదడు.. మత్య్స కారుల జీవనోపాధికి సంబంధించిన అంశమన్నారు. మత్స్యకారుల సంఘం, సంయుక్త కార్యవర్గంతో త్వరలోనే సమావేశం అవుతామని జై శంకర్ వెల్లడించారు. అయితే, గత వారం శ్రీలంక నేవీ అరెస్టు చేసిన 21 మంది జాలర్లను తిరిగి భారతదేశానికి పంపించింది. కొలంబోలోని భారత హైకమిషన్ జాఫ్నాలోని భారత కాన్సులేట్, శ్రీలంక అధికారుల సహకారంతో ఈ ప్రొగ్రాం చేపట్టారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మరో 22 మందిని శ్రీలంక నావికదశం అరెస్టు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!