Fishermens Arrest: శ్రీలంక నేవీ అదుపులో 22 మంది తమిళ మత్స్యకారులు..
- 22 మంది తమిళనాడు మత్య్సకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ..
- రెండు మెకనైజ్డ్ పడవలను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నావికాదళం..
- తొందరలోనే జాలర్లను విడిపిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishermens Arrest: సముద్ర సరిహద్దు దాటినందుకు గాను 22 మంది భారతీయ మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. భారత్- శ్రీలంక మధ్య లోతైన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తమిళ మత్స్యకారులను అరెస్టు చేశారని, వారి నుంచి రెండు మెకనైజ్డ్ పడవలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్నట్టు తరువైకులం మత్స్యకారుల సంఘం ప్రకటించింది. ఒక బ్యాచ్లో 12, మరో బ్యాచ్కు చెందిన 10 మందిని గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Read Also: Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్గా రికార్డు!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
కాగా, ఈ ఘటనలపై తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. శ్రీలంక నేవీ నుంచి తమిళ మత్య్స కారులు ఎదుర్కొంటున్న నిరంతర దాడులపై చర్చించడానికి ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధులను కూడా ఆయనతో పాటు తీసుకుపోయారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై చర్చించిన తర్వాత.. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది రాజకీయ సమస్య కాకూదడు.. మత్య్స కారుల జీవనోపాధికి సంబంధించిన అంశమన్నారు. మత్స్యకారుల సంఘం, సంయుక్త కార్యవర్గంతో త్వరలోనే సమావేశం అవుతామని జై శంకర్ వెల్లడించారు. అయితే, గత వారం శ్రీలంక నేవీ అరెస్టు చేసిన 21 మంది జాలర్లను తిరిగి భారతదేశానికి పంపించింది. కొలంబోలోని భారత హైకమిషన్ జాఫ్నాలోని భారత కాన్సులేట్, శ్రీలంక అధికారుల సహకారంతో ఈ ప్రొగ్రాం చేపట్టారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మరో 22 మందిని శ్రీలంక నావికదశం అరెస్టు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!