Bangladesh: “ఆమె రాజీనామా చేయాలి”.. బంగ్లా నిరసనల్లో 21 మంది మృతి.. భారత్ కీలక సూచనలు..
- బంగ్లాదేశ్లో మళ్లీ మొదలైన ఆందోళనలు..
- ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..
- నిరసనలకు మద్దతు తెలిపిన పలువరు మాజీ సైనికాధికారులు..
- తాజా ఘర్షణల్లో 21 మంది మృతి..
Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి నిరసనలతో అట్టుడుకుతోంది. ఇటీవల రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా బంగ్లా వ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆందోళన చేయడం హింసాత్మకంగా మారింది. అయితే, అక్కడి సుప్రీంకోర్టు ఈ నిర్ణయంపై స్టే విధించడంతో ఆందోళనలు తగ్గాయి.
అయితే, నిరసనలను పోలీసులతో ఘోరంగా అణిచివేయడంపై మరోసారి ఆ దేశంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం రాజధాని ఢాకాలోని సెంట్రల్ ఢాకా స్వ్కేర్లో భారీ నిరసన నిర్వహించారు. నిరసనలకు బంగ్లాదేశ్ కీలక నాయకుల్లో ఒకరైన ఆసిఫ్ మహమూద్ పోరాటానికి సిద్ధంగా ఉండాలని తన మద్దతుదారుల్ని కోరాడు. కొంతమంది మాజీ సైనికాధికారులు కూడా విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం భుయాన్ మద్దతుగా తన ఫేస్బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని ఎరుపుగా మార్చారు.
Also Read
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
Read Also: Waqf Board: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం?.. కేంద్రంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఆర్మీ చీఫ్ శనివారం ఢాకాలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ సైన్యం ప్రజల విశ్వాసానికి చిహ్నం అని చెప్పారు. ఇది ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మరియు ప్రజల కోసం మరియు దేశానినికి ఏ అవసరం వచ్చినా అది చేస్తుందని శనివారం సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా నిరసనల్లో 21 మంది మరణించారు. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్ని అప్రమత్తంగా ఉండాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో, దయచేసి +88-01313076402 నంబర్ని సంప్రదించాలని బంగ్లాదేశ్లోని భారత రాయబార కార్యాలయం కోరింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో 200 మందికి పైగా మరణించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
-
LSG Unwanted IPL Record: మొన్ననే ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న లక్నో!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?