Refrigerator blast: లేడీస్ హాస్టల్లో పేలిన ఫ్రిజ్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..
- తమిళనాడులో లేడీస్ హాస్టల్లో పేలిన ప్రిజ్..
- ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Refrigerator blast: తమిళనాడులో మదురైలోని ఓ లేడీస్ హాస్టల్లో ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. పలువురికి గాయాలైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఒక గదిలో ఎలక్ట్రానిక్ పరికరం పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మదురైలోని కాట్రపాళయంలో ఈ హాస్టల్ ఉంది, ఇక్కడ అనేక మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారు.
Read Also: Ford: ఫోర్డ్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
రిఫ్రిజ్రేటర్ పేలుడుతో విద్యుత్ స్పార్క్ మంటలకు దారి తీసిందని, ఫ్రిజ్ ఉన్న గది నుంచి దట్టమైన పొగ అలుముకుందని పోలీసులు వెల్లడించారు. కొద్దిసేపటికే పక్కనే ఉన్న గదులకు పొగ వ్యాపించింది. అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మండల్ని ఆర్పేశాయి. మృతులను తూత్తుకుడి జిల్లా ఏరల్ తాలూకా కురంగణికి చెందిన పరిమళ (56), తూత్తుకుడి ఎట్టయపురం తాలూకా పేరిలోవన్పట్టికి చెందిన శరణ్య (27)గా గుర్తించారు. వీరిద్దరు పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారు. కాట్రపాలేనికి చెందిన జనని (17), కని (62) సహా మరో ఇద్దరు బాధితులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గాయపడిన అనేక మందిని అనేక మందిని సమీపంలో రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. హస్టల్లో ఉంటున్న వారికి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా వేరే హాస్టల్కి తరలించారు. హాస్టల్ ఫీజుల్ని రిటర్న్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తమిళనాడు ఐటీ మినిష్టర్ డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ.. హాస్టల్ భవనానికి అనుమతులు ఉన్నాయా లేదా ప్రస్తుతం అమలులో ఉన్నాయా అనే దానిపై భవన యజమానిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు తిదీర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి భవన యజమాని ఇంబా (60)ను అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!