Ford: ఫోర్డ్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!
- భారత్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్..
- రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ford: అమెరికన్ ఆటో మేకర్ దిగ్గజం ఫోర్డ్ ఇండియాకి తిరిగి రాబోతోంది. ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలోని తమిళనాడులో ఎగుమతుల కోసం తన తయారీ ప్లాంట్ని పున: ప్రారంభించాలని యోచిస్తోంది. మూడేళ్ల క్రితం దేశంలో ఇతర కార్ తయారీ సంస్థలతో పోటీని తట్టుకోలేక ఇండియా నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎగుమతుల కోసం తమిళనాడు రాష్ట్రంలో తయారీని పున: ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫోర్డ్ లేఖను కూడా సమర్పించారు.
Read Also: Yuzvendra Chahal: విధ్వంసం సృష్టించిన యుజ్వేంద్ర చాహల్..
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
ఫోర్డ్ 2021లో భారతదేశంలో కార్ల విక్రయం నిలిపేసేందుకు కార్ల ప్రొడక్షన్ని నిలిపేసింది. కార్ల అమ్మకాల్లో పెరుగుదల లేకపోవడంతో 2022లో ఎగుమతులని ఉపసంహరించుకుంది. ఆసియాలోని ప్రముఖ కార్ కంపెనీల గట్టి పోటీ కారణంగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ మార్కెట్గా ఉన్న భారత్ నుంచి నిష్ర్కమించింది. తాజాగా ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్ కోసం ఎగుమతులు చేయడానికి తిరిగి ప్లాంట్ని రీ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు చెన్నై ప్లాంట్లో ఫోర్డ్ తయారు చేయాలనుకుంటున్న కార్లు, ఇతర వివరాలను తర్వాత ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. గతంలో చెన్నై ప్లాంట్లో ఫోర్డ్ కార్లు, ఇంజన్లను తయారు చేసేంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!