Munna Cylinder: మార్కెట్లోకి 2 కిలోల ‘మున్నా’ సిలిండర్.. ఆ రాష్ట్రాలకు మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ గుడ్ న్యూస్ చెప్పంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో 2 కిలోల మున్నాను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. త్వరలోనే మున్నా సిలిండర్ను విడుదల చేస్తామని సంస్థ చెబుతుంది. ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్ఫ్రా డెవలప్మెంట్పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు. అస్సాంలో విలేకరుల సమావేశంలో అసోం ఆయిల్ డివిజన్ ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు స్టేట్ హెడ్.జి రమేష్ మాట్లాడుతూ.. గత ఏడాది ఈశాన్య ప్రాంతంలో ‘ఛోటు’ 5 కిలోల ఎల్పిజి సిలిండర్ను ప్రవేశపెట్టిన తర్వాత, తాము 2 కిలోల ‘మున్నా’ సిలిండర్ను కూడా ప్రవేశపెడతామని.. త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
త్రిపుర, నార్త్ గౌహతిలో త్వరలో ‘మున్నా’ బాటిలింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్లు రమేష్ తెలిపారు. ఈ తేలికపాటి LPG సిలిండర్లు పట్టణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలోని వలస జనాభా అవసరాలను తీరుస్తాయన్నారు. అంతేకాకుండా తక్కువ వినియోగం మరియు తక్కువ స్థలంలో వ్యాపారం చేసే వారికి ఈ సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ‘మున్నా’ సిలిండర్ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘మున్నా’ కిలో ధర సాధారణ డొమెస్టిక్ సిలిండర్తో సమానంగా ఉంటుంది. అయితే ‘ఛోటు’ సిలిండర్ ధర కొంచెం ఎక్కువగా ఉంది. రీజియన్లో ‘ఛోటు’కి మంచి స్పందన వచ్చిందని.. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 60,000-65,000 యూనిట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 15,000 యూనిట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు.
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ
ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ ఈశాన్య ప్రాంతంలో 871 LPG డిస్ట్రిబ్యూటర్లను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం 112 లక్షల LPG కస్టమర్ బేస్ ఉంది. అందులో 91 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు ఉన్నారు. మేఘాలయ మరియు మిజోరాంలలో అన్ని ఈశాన్య రాష్ట్రాలలో LPG బాట్లింగ్ ప్లాంట్లను నెలకొల్పడానికి ప్రాజెక్టులు ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రెండు రాష్ట్రాల్లో ఎటువంటి ప్లాంట్లు లేవు. అయితే మేఘాలయలోని ఉమియామ్ ప్రాంతంలో రూ.75.54 కోట్లతో ఏడాదికి 30 వేల మెట్రిక్ టన్నుల కొత్త (TMTPA) LPG బాట్లింగ్ ప్లాంట్కు సంబంధించిన పనులను చేపట్టారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!