Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు.…