Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 13000 Security Forces Anti Bomb Squads Ayodhya Gears Up For Ram Mandir Opening

Ayodhya security: 13,000 మంది భద్రతా, బాంబ్ స్క్వాడ్స్, ఏటీఎస్.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..

Published Date :January 21, 2024 , 3:59 pm
By Venu Goapl Reddy
Ayodhya security: 13,000 మంది భద్రతా, బాంబ్ స్క్వాడ్స్, ఏటీఎస్.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ayodhya security: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లోని ప్రముఖులు, సెలబ్రెటీలు, దౌత్యవేత్తలు, లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రత కోసమ మల్టీ లెవల్ భద్రత ప్రణాళికలో భాగంగా నగరంలో 13,000 మంది బలగాలను మోహరించారు. రేపు ఈ మహత్తర కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు రాబోతున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. ఈ వేడుకలకు మొత్తం వీవీఐపీలు, సాధువులతో కలిపి 7000 మందికి పైగా ప్రముఖులు వస్తున్నారు.

Read Also: DK Shivakumar: “నా పేరుతో శివుడు, ఆయన పేరులో రాముడు”.. బీజేపీపై డీకే శివకుమార్ విమర్శలు..

Also Read

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!

భద్రత కట్టుదిట్టం:

అయోధ్య ఎక్కడా చూసిన భద్రతే కనిపిస్తోంది. మొత్తం 13,000 మంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అయోధ్యలో క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇక ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌(ఏటీఎస్)ని రంగంలోకి దింపింది. 24×7 పర్యవేక్షణ కోసం అయోధ్య అంతటా 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. లతా మంగేష్కర్ చౌక్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బందిని మోహరించారు. సరయు నదిపై పోలీసులు తరచూ బోట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ప్రాణ్ ప్రతిష్ట’ కోసం భక్తులు, ప్రముఖులు నగరానికి రావడం ప్రారంభించడంతో యాంటీ బాంబ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. వీవీఐపీల కదలికల సమయంలో ట్రాఫిక్‌ని నిర్వహించేందుక ప్రధాన కూడళ్లలో ముళ్ల కంచెను ఉపయోగిస్తున్నారు. నేరస్తుల కదలికను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ఆర్టిఫిషియల్(AI) కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇక అన్ని భద్రతా సంస్థలు రియల్ టైమ్‌లో సెక్యూరిటీని పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలోని 51 నిర్దేశిత ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. 22,825 వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ఈ ప్రదేశాలను నిరంతరం డ్రోన్‌లతో పర్యవేక్షిస్తుంటారు. రామమందిర శంకుస్థాపనకు వచ్చే అతిథుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు 51 స్థలాలను గుర్తించినట్లు ట్రాఫిక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) బీడీ పాల్సన్ తెలిపారు. ఇక జీవ, రసాయన, అణు దాడుల్ని, భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన NDRF బృందాలు మోహరించబడ్డాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anti-bomb squads
  • Ayodhya
  • Ayodhya Ram Mandir
  • Ayodhya Security
  • Ram Mandir Inauguration

తాజావార్తలు

  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

  • Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!

  • Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..

  • LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions