Report: నెలలు నిండకముందే జననం, తక్కువ బరువు.. ప్రమాదంలో పసిపిల్లలు..
- పిల్లల పుట్టుకపై ప్రభావం చూపిస్తున్న వాయు కాలుష్యం..
- 13 శాతం పిల్లలు నిలలు నిండకముందే జననం..
- 17 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నట్లు చెప్పిన అధ్యయనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Report: భారతదేశంలో 2019-21 జనాభా ఆరోగ్య సర్వే ప్రకారం, 13 శాతం మంది పిల్లలు నెలలు నిండకముందే జన్మించారని, 17 శాతం మంది పుట్టిన సమయంలో తక్కువ బరువు ఉన్నారని తేలింది. వాయు కాలుష్యం పిల్లల జననాలను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్-ముంబై , UK- ఐర్లాండ్లోని ఇన్స్టిట్యూట్ల పరిశోధకులు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5, రిమోట్ సెన్సింగ్ డేటాను పరిశీలించి గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి గురికావడం ప్రతికూల ప్రసవాలకు కారణం అవుతుందని విశ్లేషించాయి.
గర్భధారణ సమయంలో PM2.5 వాయు కాలుష్యానికి గురికావడం వల్ల తక్కువ బరువుతో శిశువు జననలు 40 శాతం, అకాల ప్రసవానికి 70 శాతం అవకాశం ఉందని పరిశోధన టీం కనుగొంది. వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాతావరణ పరిస్థితులు ప్రతికూల బర్త్ రిజల్ట్స్తో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. PLoS గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. భారతదేశ ఉత్తర ప్రాంతాల్లో నివసించే పిల్లలు, వాయు కాలుష్యానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని చెప్పింది.
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
Read Also: Disha Salian Case: దిశా సాలియన్ది ఆత్మహత్య.. హత్యకు ఆధారాలు లేవు..
2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన, 2.5 (PM2.5) సూక్ష్మ కణాలు అత్యంత హానికరమైన వాయు కాలుష్య కారకాల్లో ఒకటిగe పరిగణిస్తారు. వీటిలో శిలాజ ఇంధన, బయోమాస్ వ్యర్థాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఉన్న ఎగువ గంగా ప్రాంతంలో PM2.5 కాలుష్య కారకాలు అధిక స్థాయిలో ఉన్నాయని పరిశోధన చెప్పింది. దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో 39 శాతం, ఉత్తరాఖండ్లో 27 శాతం, రాజస్థాన్లో 18 శాతం, ఢిల్లీలో 17 శాతం అకాల జననాలు కనిపిస్తున్నట్లు చెప్పింది. మిజోరాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఇది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. పంజాబ్లో 22 శాతం తక్కువ బరువుతో శిశువులు పుడుతునున్నట్లు పరిశోధన తెలిపింది. పంజాబ్ తర్వాత ఢిల్లీ, దాద్రా అండ్ నాగర్ హవేలి, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?