Report: నెలలు నిండకముందే జననం, తక్కువ బరువు.. ప్రమాదంలో పసిపిల్లలు..
- పిల్లల పుట్టుకపై ప్రభావం చూపిస్తున్న వాయు కాలుష్యం..
- 13 శాతం పిల్లలు నిలలు నిండకముందే జననం..
- 17 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నట్లు చెప్పిన అధ్యయనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Report: భారతదేశంలో 2019-21 జనాభా ఆరోగ్య సర్వే ప్రకారం, 13 శాతం మంది పిల్లలు నెలలు నిండకముందే జన్మించారని, 17 శాతం మంది పుట్టిన సమయంలో తక్కువ బరువు ఉన్నారని తేలింది. వాయు కాలుష్యం పిల్లల జననాలను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్-ముంబై , UK- ఐర్లాండ్లోని ఇన్స్టిట్యూట్ల పరిశోధకులు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5, రిమోట్ సెన్సింగ్ డేటాను పరిశీలించి గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి గురికావడం ప్రతికూల ప్రసవాలకు కారణం అవుతుందని విశ్లేషించాయి.
గర్భధారణ సమయంలో PM2.5 వాయు కాలుష్యానికి గురికావడం వల్ల తక్కువ బరువుతో శిశువు జననలు 40 శాతం, అకాల ప్రసవానికి 70 శాతం అవకాశం ఉందని పరిశోధన టీం కనుగొంది. వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాతావరణ పరిస్థితులు ప్రతికూల బర్త్ రిజల్ట్స్తో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. PLoS గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. భారతదేశ ఉత్తర ప్రాంతాల్లో నివసించే పిల్లలు, వాయు కాలుష్యానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని చెప్పింది.
Also Read
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
- CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
Read Also: Disha Salian Case: దిశా సాలియన్ది ఆత్మహత్య.. హత్యకు ఆధారాలు లేవు..
2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన, 2.5 (PM2.5) సూక్ష్మ కణాలు అత్యంత హానికరమైన వాయు కాలుష్య కారకాల్లో ఒకటిగe పరిగణిస్తారు. వీటిలో శిలాజ ఇంధన, బయోమాస్ వ్యర్థాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఉన్న ఎగువ గంగా ప్రాంతంలో PM2.5 కాలుష్య కారకాలు అధిక స్థాయిలో ఉన్నాయని పరిశోధన చెప్పింది. దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో 39 శాతం, ఉత్తరాఖండ్లో 27 శాతం, రాజస్థాన్లో 18 శాతం, ఢిల్లీలో 17 శాతం అకాల జననాలు కనిపిస్తున్నట్లు చెప్పింది. మిజోరాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఇది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. పంజాబ్లో 22 శాతం తక్కువ బరువుతో శిశువులు పుడుతునున్నట్లు పరిశోధన తెలిపింది. పంజాబ్ తర్వాత ఢిల్లీ, దాద్రా అండ్ నాగర్ హవేలి, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
-
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత