Cash Seizure: కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే రూ.1,021 కోట్లు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశంలో అసెంబ్లీ ఎన్నికల జోరు సాగుతోంది. ఈ ఎన్నికల పోరు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. కాగా ఎన్నికల బరిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో లెక్కాపత్రం లేని నగదు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా మాట్లాడుతూ. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలు ముందే ఆదాయ పన్ను విభాగంతో సహా దర్యాప్తు సంస్థలు నల్లధనం పైన నిఘా పెంచాయని తెలిపారు. కాగా టోల్ఫ్రీ నెంబర్ల ద్వారా సరైన ఆధారాలు లేని నగదు, నగలకు సంబంధించిన సమాచారం తమకు అందుతోందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ఆధారాలు లేని నగదు, ఆభరణాలకు సంబంధించిన సోదాలు ముమ్మరం చేసామని గుప్తా వెల్లడించారు.
Read also:Train Accident: పట్టాలపై చెక్క దిమ్మె, ఇనుప రాడ్లు.. రైలును ఢీకొట్టించే కుట్ర
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
అలానే ఈ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం సహా రాష్ట్రాల ఎన్నికల అథారిటీ సమన్వయంతో జరుగుతున్నట్లు తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఓటర్లకు ఉచిత కానుకలు, నగదు, మందు, మాధకద్రవ్యాల పంపిణీని అరికట్టేందుకు జులైలో లోనే అధికారులు పాటించాల్సిన నిబంధనలను సీబీఐసీ జారీ చేసిందని.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు వీటిని రూపొందించిందని తెలిపిన ఆయన.. ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా నిఘా పెంచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో చేసిన తనిఖీలలో రాజస్థాన్లో అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి.. స్వాధీనం గతంతో పోలిస్తే మూడింతలు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. 2021 లో స్వాధీనం చేసుకున్న వాటి విలువ .322 కోట్లు ఉండగా 2022లో రూ.347 కోట్లు ఉంది. అయితే 2023లో అక్టోబర్ వరకు రూ.1,021 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!