US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలస.. 10 రెట్లు పెరిగినట్లు నివేదిక..
- కెనడా నుంచి అమెరికాకు పెరిగిన భారతీయుల అక్రమ వలస..
- 10 రెట్లు పెరిగినట్లు చెబుతున్న నివేదిక..
- రాజకీయ అణిచివేత, ఖలిస్తానీ అంశాలు వలసలకు కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలసలు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అక్రమంగా సరిహద్దు దాటడం 10 రెట్లు పెరిగినట్లు చెబుతోంది. యూఎస్ సరిహద్దు గస్తీ డేటా ఈ వివరాలను చెబుతోంది. భారతదేశం నుంచి అక్రమ వలసలు ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా పెరిగినట్లు అమెరికన్ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. యూఎస్ సరిహద్దు డేటా ప్రకారం.. సెప్టెంబర్ 30 వరకు ఈ ఏడాదిలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో 14,000 మందికి పైగా భారతీయులు అరెస్టయ్యారు. ఇది కేవలం రెండేళ్లలో 10 శాతం పెరిగింది. అమెరికా-కెనడా సరిహద్దుల్లో జరిగిన మొత్తం అరెస్టుల్లో 60 శాతం భారత సంతతి వ్యక్తులే ఉన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2022 నాటికి అమెరికాలో అక్రమంగా దాదాపుగా 7,25,000 మంది భారతీయులు నివిస్తున్నట్లు అంచనా. అయితే, కెనడా నుంచి అమెరికాకు పెరిగిన వలసలకు కారణాలను కూడా రిపోర్ట్ చర్చింది. రాజకీయ అణిచివేత, ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం వంటి అంశాలు దోహదం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ, వీసాలు, పర్మిట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం కూడా అక్రమ వలసల్ని పెంచినట్లు తెలుస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఈ వలసలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 2022లో జనవరిలో తీవ్రమైన చలిలో జగదీష్ పటేల్, అతడి భార్య వైశాలిబెన్, ఇద్దరు చిన్న పిల్లలు ఇలాగే యూఎస్ కెనడా సరిహద్దు దాటాలని ప్రయత్నించారు. అయితే, గడ్డకట్టే చలిలో చిక్కుకుని నలుగురు మరణించడం ప్రపంచ స్థాయి వార్తగా నిలిచింది. మెరుగైన జీవితం కోసం పాఠశాల ఉపాధ్యాయుడు జగదీష్ అతడి కుటుంబం అమెరికా పయణమైంది. -36 డిగ్రీ సెల్సియస్ చలిలో బార్డర్ దాటేందుకు యత్నించి మరణించారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో సరిహద్దుల్లో వలసల్ని అడ్డుకునేందుకు ‘‘బోర్డర్ సీజర్’’గా వలసల్ని వ్యతిరేకించే టామ్ హోమన్ని నియమించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!