PM Modi: ప్రధాని మోడీ ఖాతాలో మరో అత్యున్నత అవార్డ్.. క్వీన్ ఎలిజబెత్ తర్వాత రెండో వ్యక్తిగా హిస్టరీ..
- ప్రధాని నరేంద్రమోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం..
- జీకాన్తో సత్కరించిన నైజీరియా..
- క్వీన్ ఎలిజబెత్ తర్వాత అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా వెళ్లారు. నైజీరియాతో పాటు జి-20 సమ్మిట్ జరిగే బ్రెజిల్తో పాటు దక్షిణ అమెరికా దేశమైన గయానాలో కూడా పర్యటించబోతున్నారు. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అత్యున్నత విదేశీ పురస్కారం చేసింది. నైజీరియా ప్రభుత్వం ప్రధాని మోడీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్(జికాన్)తో సత్కరించనుంది. దీంతో ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ వ్యక్తిగా ప్రధాని చరిత్ర సృష్టించారు. 1969లో జికాన్ అవార్డును క్వీన్ ఎలిజబెత్ పొందారు. ఈ అవార్డు అందుకున్న మొదటి విదేశీ వ్యక్తిగా ఆమె నిలిచారు.
Read Also: Nitin Gadkari: రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోరు..
Also Read
ప్రధాని నరేంద్రమోడీకి ఒక దేశం ప్రధానం చేస్తున్న 17వ అత్యున్న పురస్కారం ఇది. ప్రధాని మోడీకి రాజధాని అబుజాలో ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్వో వైక్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి అబుజా ‘కీ టు ది సిటీ’ని బహుకరించారు. కీ నైజీరియా ప్రజలు ప్రధానమంత్రిపై ఉంచిన విశ్వాసం మరియు గౌరవానికి ప్రతీక. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి నైజీరియాతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.
’’ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో మా సన్నిహిత భాగస్వామి అయిన నైజీరియాకు ఇది నా మొదటి పర్యటన. ప్రజాస్వామ్యంపై భాగస్వామ్య నమ్మకంపై ఆధారపడిన మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నా పర్యటన ఒక అవకాశం. నేను భారతీయ సమాజాన్ని, నైజీరియాలోని స్నేహితులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని పర్యటనకు ముందు ట్వీట్ చేశారు. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!