Gujarat: ముదిరిన “దర్గా” వివాదం.. పోలీస్ స్టేషన్పై ఓ వర్గం రాళ్ల దాడి.. ఒకరు మృతి
Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ అట్టుడుకుతోంది. దర్గా వివాదంతో ఓ వర్గం ప్రజలు దాదాపుగా 500-600 మంది స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా.. దాదాపుగా 5 మంది పోలీసులు గాయపడ్దారు. జునాగఢ్ మజేవాడి దర్వాజా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు స్థానికంగా అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని పట్ణణ పరిపాలనాధికారులు నిర్ణయించారు. దీంతో ఓ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వాహనాలను తగలబెట్టారు. అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీచార్జ్ చేవారు. ఘటనలో పాల్గొన్న 174 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Ramcharan-Upasana : పుట్టబోయే బిడ్డకు చిరు కానుక ఇచ్చిన ప్రజ్వలా ఫౌండేషన్…!!
Also Read
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
ఈ దాడిలో ఓ వ్యక్తి రాళ్లు తగిలి మరణించారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంపు విసిరిన రాళ్ల వల్లే మరణించి ఉండవచ్చని, పోస్టుమార్టం నివేదికత తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. మజేవాడి దర్వాజా సమీపంలోని ఒక మసీదు భూమికి సంబంధించి పత్రాలను సమర్పించాలని జునాగఢ్ మునిసిపల్ కార్పరేషన్ జూన్ 14 నోటీసులు జారీ చేసింది. దీంతో 500-600 మంది ప్రజలు సదరు నిర్మాణం వద్ద గుమిగూడి శుక్రవారం రాత్రి రోడ్లను దిగ్భందించారని ఎస్పీ రవితేజ వాసంశెట్టి తెలిపారు.
జునాగఢ్ డిప్యూటీ ఎస్పీ, ఇతర సిబ్బంది ఆందోళన చెస్తున్న ప్రజలు ఒప్పించేందుకు ప్రయత్నించారు. శాంతి స్థాపనే లక్ష్యంగా దాదాపు గంట పాటు చర్చల తరువాత రాత్రి 10.15 గంటల సమయంలో పోలీస్ సిబ్బందిపై రాళ్లు రువ్వారు. జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో జునాగఢ్ డివైఎస్పీ, ముగ్గురు సబ్-ఇన్స్పెక్టర్లు, మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారని, అయితే వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని, గుంపు వాహనానికి నిప్పుపెట్టిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని రంగంలోకి దించామని, ఘర్షణలో పాల్గొన్న వారందరినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z
— ANI (@ANI) June 17, 2023
తాజావార్తలు
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
-
Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల ‘టోకెన్ స్ట్రైక్’
-
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!